BigTV English

Suspicious person at Airport: ఎయిర్‌పోర్టులో జగన్, అనుమానాస్పద వ్యక్తి, పోలీసులు అదుపులో..

Suspicious person at Airport: ఎయిర్‌పోర్టులో జగన్, అనుమానాస్పద వ్యక్తి, పోలీసులు అదుపులో..

CM Jagan london tour updates(AP news today telugu):

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలకు ముప్పు పొంచివుందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తాజాగా సీఎం జగన్ లండన్ టూర్ వెళ్లారు. పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు వెళ్లారు.


ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టులో ఉండగానే అనుమానాస్పదంగా తిరిగాడు ఓ వ్యక్తి. పోలీసులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను అమెరికాకు చెందిన డాక్టర్ తుల్లూరు లోకేష్‌గా గుర్తించారు. ఆయనకు అమెరికన్ సిటిజన్ షిప్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఫారెన్ టూర్‌పై ముందుగానే ఆ డాక్టర్ కొన్ని మెసేజ్‌లు ఇతరులకు పంపించనట్టు గుర్తించారు పోలీసులు. విచారణ సమయంలో గుండెపోటు రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.

ఏపీలో ఎన్నికలు ముగియడంతో న్యాయస్థానం అనుమతితో సీఎం జగన్ లండన్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. అక్కడ సీఎం జగన్‌కు పార్టీ నేతలు జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొట్టు సత్యనారాయణ వంటి నేతలు సెండాఫ్ ఇచ్చారు. మళ్లీ మే 31న సీఎం జగన్ ఏపీకి తిరిగి రానున్నారు.


ALSO READ:  కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కీలక నాయకులను అల్లరిమూకలు టార్గెట్‌గా చేసుకున్నట్లు వార్తలు లేకపోలేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముప్పు పొంచివుందన్న నేపథ్యంలో కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పుడున్న 12 బదులు 24 మంది బ్లాక్ కమెండోలను కేటాయించింది. రెండు షిప్టుల్లో వీరంతా పని చేయనున్నారు. ఈ సమయంలో ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరగడం కలకలం రేపుతోంది. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Tags

Related News

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

Big Stories

×