E-Paper
Advertisement

TDP cadre attack: పల్నాడులో ఉద్రిక్తత.. టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడి

TDP cadre attack: పల్నాడులో ఉద్రిక్తత.. టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడి

TDP cadre attack: పల్నాడులో ఏం జరుగుతోంది? ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న టీడీపీ శ్రేణులు ఎందుకు దాడులకు తెగబడ్డారు? టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? ఇదంతా వైసీపీ ప్లాన్ ప్రకారమే చేస్తుందా? అసలు పల్నాడులో ఏం జరుగుతోంది? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

ఎన్నికల తర్వాత పల్నాడులో మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల పర్యటనకు సిద్ధమయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు. ఆయనతోపాటు పార్టీకి చెందిన పలువురు వాహనంలో అమరావతి ప్రాంతానికి బయలుదేరారు.

ALSO READ: విజయవాడలో మరోసారి విరిగిపడిన కొండచరియలు.. ఒకరు మృతి

వైసీపీ నేతల పర్యటనను అడ్డుకోవాలని ఆ నియోజకవర్గం టీడీపీ నేతలు పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వెళ్తున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కారుని వేగంగా పోనివ్వడంతో కర్రలతో మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడులకు దిగారు.

పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలు సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ కార్యకర్తలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎట్టకేలకు  పోలీసుల జోక్యంతో కార్యకర్తలు శాంతించారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే కారు డ్యామేజ్ అయ్యింది.

ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు అయ్యింది. మాచర్ల, నరసారావుపేట ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? దీనికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు ఆ ప్రాంత తెలుగు తమ్ముళ్లు.

కొద్దిరోజులుగా ఆ నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య కోల్డ్‌ వార్ జరుగుతోంది.  అదును కోసం చూసిన వైసీపీ కేడర్, మంగళవారం ఉదయం వరద ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న టీడీపీ కేడర్ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయన్నది దిగువస్థాయి నేతల మాట. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×