BigTV English

TDP Serious: వైఎస్ భారతిపై అసభ్యకర పోస్టు.. ఐటీడీపీ కార్యకర్తపై హైకమాండ్ ఆగ్రహం, ఆపై..

TDP Serious: వైఎస్ భారతిపై అసభ్యకర పోస్టు.. ఐటీడీపీ కార్యకర్తపై హైకమాండ్ ఆగ్రహం, ఆపై..

TDP Serious:  సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్ చేసిన వారిని విడిచిపెట్టలేదు కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో చాలామంది నేతలు అరెస్ట్ అయ్యారు. నేతలు, వారి వ్యక్తిగత వ్యవహారాలపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అలాంటి పని చేసిన ఐటీడీపీ కార్యకర్తపై వేటు వేసింది. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది కూడా టీడీపీ కమాండ్.


గడిచిన కొన్నాళ్లుగా నేతలు, సెలబెట్రీలు వ్యక్తిగత జీవితాలు, ఫ్యామిలీలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు పార్టీల మద్దతుదారులు. వైసీపీ హయాంలో ఈ సంస్కృతి మరింత ఎక్కువైంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే వాటిపై దృష్టిపెట్టింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీలోకి కొందరు నేతలు, కార్యకర్తలు అరెస్టు అయ్యారు. మరి కొందర్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా మాజీ సీఎం జగన్ వైఫ్ భారతి(Bharathi)పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Kiran). అతడి వ్యాఖ్యల వ్యవహారం టీడీపీ హైకమాండ్ దృష్టిలో పడింది. దీనిపై సీరియస్ అయ్యింది. వెంటనే అతడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కిరణ్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే కిరణ్‌పై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. అతడ్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ వ్యవహారంపై కిరణ్ రియాక్ట్ అయ్యాడు. మాట్లాడిన వీడియోను విడుదల చేశాడు. వైఎస్ భారతిపై తాను చాలా తప్పుగా మాట్లాడానని తెలిపాడు. జగన్ దంపతులు తనను క్షమించాలని వేడుకున్నాడు. మహిళల గురించి ఇలా మాట్లాడడం ముమ్మాటికీ తప్పు అని చెప్పాడు. క్షణికావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశానని వేడుకున్నాడు.

ALSO READ: కవిత వర్సెస్ జనసేన అద్దాల భవనంలో ఉండేవాళ్లు రాళ్లు విసిరితే అంతే

మరోవైపు కిరణ్ ఎపిసోడ్‌పై వైసీపీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ఎక్స్ వేదికగా ఆ పార్టీ స్పందించింది. ఇది ముమ్మాటికీ సిగ్గుచేటుగా తెలిపింది. ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. మాజీ సీఎం జగన్ కుటుంబంపై ఐటీడీపీ కార్యకర్త ఈ విధంగా మాట్లాడడం మంచిదికాదని పేర్కొంది. వెంటనే అతడ్ని అరెస్టు చేయాలన్నది వైసీపీ డిమాండ్.

ఈ తరహా పనులు ఎవరు చేసినా ఇబ్బందులు ఎదుర్కొంటారని కిరణ్ వ్యవహారం ద్వారా  చెప్పకనే చెప్పింది కూటమి ప్రభుత్వం. మరికొందరికి ఇదొక గట్టి హెచ్చరిక. తప్పు చేస్తే సొంతవారిని ఉపేక్షించేది లేదని బలమైన సంకేతాలు ఇచ్చింది టీడీపీ. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. మొత్తానికి చాన్నాళ్లు తర్వాత ఏపీలో మంచి సంప్రదాయం మొదలయ్యిందనే చెప్పవచ్చు.

 

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×