E-Paper
Advertisement

Kutami MLA’s Meeting in VIjayawada: విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం.. ఎల్పీ నేత ఎంపిక, ఆపై..!

Kutami MLA’s Meeting in VIjayawada: విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం.. ఎల్పీ నేత ఎంపిక, ఆపై..!
Advertisement

TDP, JSP, BJP MLA’s Meeting in Vijayawada about MLC: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం రెండురోజులు మాత్రమే ఉండడంతో గెలిచిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి మంత్రి పదవి ఎవరిని వరించబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది.

సోమవారం సాయంత్రం మోదీ కేబినెట్‌లోని శాఖలు కొలిక్కి రానుంది. ఎవరికి ఏయే శాఖలు ఇస్తారనేది తెలియనుంది. ఆయా శాఖలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు తన కేబినెట్‌పై ఫోకస్ పెట్టనున్నారు.
ఇందులోభాగంగా కూటమి ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడలోని కన్వెన్షన్ హాలులో సమావేశం కానున్నారు.

Advertisement

ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జరగనున్న ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ భేటీలో ఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. బుధవారం ఉదయం దాదాపు పదకొండున్నర గంటల సమయంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పని లోపనిగా ప్రతిపక్ష నేత ఎంపిక జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వైసీపీకి తగిన మెజార్టీ లేకపోవడంతో జనసేనకు ఆ ఛాన్స్ వచ్చింది. మరి జనసేన నుంచి నలుగురైదుగు రు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం సీఎంతో కలిసి 26 మందికి ఛాన్స్ ఉంది. ఆ లెక్కన కొత్త జిల్లాలు 26 ఉన్నాయి. జిల్లాకు ఒకరికి మంత్రిగా ఛాన్స్ ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

ALSO READ: ఏపీ, నాన్ బ్రాండెడ్ లిక్కర్‌కు బ్రేక్, గోడౌన్లకి కింగ్ ఫిషర్ బీర్లు

టీడీపీ నుంచి సీనియర్లు ఈసారి పదవులు ఆశిస్తున్నారు. ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే కొత్త ఎన్నికైన మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు. లేదంటే రెండున్నర ఏళ్లకు కేబినెట్‌ను మార్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అంటున్నారు. దాదాపుగా 22 మంది మంత్రి పదవులు తీసుకోవాలన్నది అధినేత ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నమాట. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి ఇవ్వవచ్చని అంటున్నారు. మొత్తం సీట్లలో టీడీపీ-135, జనసేన- 21, వైసీపీ-11, బీజేపీ -8 సీట్లలో గెలుపొందాయి.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×