TDP Leader Atchannaidu Complaints Against Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీరుపై టీడీపీ మండిపడింది. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న ఆయన రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అతనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి గత ఐదేళ్లుగా వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న సజ్జల రాజకీయాలు మాట్లాడుతున్నారని అచ్చెన్న ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఏపీ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనాకు లేఖ రాశారు.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలవుతున్నా సరే.. సజ్జల ఎన్నికల నియమావళని ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారుల ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది.
Also Read: Chandrababu: కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీనే లక్ష్యం: చంద్రబాబు
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు వెంటనే సజ్జలను తన పదవి నుంచి తొలగించాలని టీడీపీ కోరింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయలు మాట్లాడడం సరికాదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.