E-Paper
Advertisement

TDP Leaders : ఆయన మంత్రి అయ్యాకే తునిలో దాడులు: యనమల.. గొడ్డలిపోటును మంత్రులు వారసత్వంగా తీసుకున్నారు: అచ్చెన్న

TDP Leaders : ఆయన మంత్రి అయ్యాకే తునిలో దాడులు: యనమల.. గొడ్డలిపోటును మంత్రులు వారసత్వంగా తీసుకున్నారు: అచ్చెన్న
Advertisement

TDP Leaders : కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై దాడి ఘటన ఏపీలో పెనుదుమారం రేపుతోంది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సంస్కృతిగా మారిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం పాలన నడుస్తోందని మండిపడుతున్నారు.

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పొల్నాటి శేషగిరిరావును టీడీపీ సీనియర్‌ నేతలు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజాపై యనమల తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలను అడ్డుకోవడానికి తునిలో ఒక ఆర్గనైజేషన్ పని చేస్తుందన్నారు. దాడిశెట్టి రాజా మంత్రి అయ్యాక ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ దాడికి ప్రభుత్వం, సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవాలన్నారు.

Advertisement

సీఎం జగన్ గొడ్డలిపోటును రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వారసత్వంగా తీసుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులే టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి చేశారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తున్న టీడీపీ నేతలను అణిచివేసేందుకు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తుని నియోజకవర్గంలో ఒక వర్గానికి అన్యాయం చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ చర్యలను నిలదీస్తున్నందుకే శేషగిరిరావును చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. హత్యలు, దాడులు చేసే ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని అచ్చెన్న పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. ఈ కేసులో నిందితులను
కటకటాల వెనక్కి పంపే వరకు పోరాడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×