E-Paper
Advertisement

Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

Kalisetti Appalanaidu: జగన్ సంతకాల సేకరణ ఓ సినిమా సెట్టింగ్.. పులివెందులలోనే పరువు పోయింది: ఎంపీ అప్పలనాయుడు ఫైర్

Kalisetti Appalanaidu: వైఎస్ఆర్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. జగన్ సేకరించిన సంతకాల కట్టలు, వాటిని గవర్నర్‌కు పంపించడం అంతా ఒక “సినిమా సెట్టింగ్”లా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొంగ సంతకాలు సేకరించి గవర్నర్‌కు పంపిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని, కానీ చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే ఎంతో అభివృద్ధిని చేసి చూపిందని అన్నారు. ప్రజలు ఛీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా జగన్ ఇంకా పగటికలలు కంటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లెలో కూడా సంతకాలు సేకరించామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని అప్పలనాయుడు హితవు పలికారు. ఎక్కడో కూర్చుని మాట్లాడటం కాదని, క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. గతంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా లక్ష పోస్ట్ కార్డులతో మద్దతు తెలిపారని, అది నిజమైన ప్రజాభిమానమని గుర్తు చేశారు.

రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబు పాలనను, ఎన్డీయే కూటమిని కోరుకుంటున్నారని ఎంపీ స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా తీసుకుని సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నారని తెలిపారు. బాధ్యతాయుతమైన పాలన అందిస్తున్న చంద్రబాబు వైపు నేడు దేశం మొత్తం చూస్తోందని, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం చంద్రబాబు పాలన బాగుందని ప్రశంసించారని అప్పలనాయుడు పేర్కొన్నారు.

Read Also: Srisailam Temple: శ్రీశైలం టెంపుల్ వద్ద యువతి రీల్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్.. తీరా సీన్ కట్ చేస్తే…?

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×