E-Paper
Advertisement

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

TDP vs YCP: ఏపీలో రాజకీయాలు రంజుగా మారాయి. జస్ట్ ఒక్క ఛాన్స్ దొరికితే చాలు.. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు.. విమర్శల దాడికి దిగుతున్నాయి. ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారం తెరమీదికి వచ్చిన సమయం నుండి టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం ఓ వైపు, ట్వీట్ ల వర్షం మరో వైపు సాగుతోంది. అయితే తాజాగా టీడీపీ ఎక్స్ ఖాతా నుండి, మాజీ సీఎం వైయస్ జగన్ కు శుభాకంక్షలు తెలిపారు. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే వీరి మధ్య శుభాకాంక్షలు చెప్పుకోవడం ఏమిటనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చూడాల్సిందే.

మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ ఆస్తులకు సంబంధించి ఇటీవల టీడీపీ సోషల్ మీడియా రాజకీయ దుమారం లేపే ట్వీట్లను వరుసగా పోస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆస్తులకు సంబంధించిన వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ రాసిన లేఖను, టీడీపీ సోషల్ మీడియా నుండి బయటకు రావడంతో మాజీ సీఎం జగన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి ఫ్యామిలీలో ఉండే సమస్యలు, తమ ఫ్యామిలీలో కూడా ఉన్నాయని, వాటి గురించి పదేపదే మీడియా ద్వారా చూపించడం బదులు, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని టీడీపీకి జగన్ సూచించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, సూపర్ సిక్స్ పథకాల అమలకు బదులు తన తల్లి, చెల్లి ఫోటోలను చూపిస్తూ టీడీపీ అనుకూల మీడియా ఆనంద పడుతుందని, ప్రజా సమస్యలు ఎవరికీ పట్టని రీతిలో ఏపీలో పరిపాలన సాగుతుందని విమర్శించారు.

Also Read: YS Jagan: మా ఇంటి వైపు తొంగి చూడొద్దు.. అన్ని కుటుంబాలలో ఉండేదేగా.. ఆస్తి వివాదంపై జగన్ స్పందన

అయితే తాజాగా టీడీపీ ఎక్స్ ఖాతా నుండి పోస్ట్ చేసిన ట్వీట్.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ కు హ్యాపీ కోడి కత్తి డే అంటూ శుభాకాంక్షలు తెలపడంపై వైసీపీ సోషల్ మీడియా భగ్గుమంది. అలాగే 6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.. తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టండి జగన్ అంటూ పోస్ట్ చేశారు.

కాగా గతంలో జగన్ పై విశాఖ విమానాశ్రయం వద్ద కోడి కత్తితో దాడి జరగగా, నేటికీ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ సోషల్ మీడియా ఈ పోస్ట్ చేసిందని భావించవచ్చు. అంతేకాకుండా నాటి జగన్ పై దాడి జరిగిన ఫోటోలను సైతం పోస్ట్ చేసి, దళిత యువకుడు శ్రీను జీవితాన్ని నిలబెట్టాలని సూచించింది. అసలే టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ ల విమర్శలు సాగుతుండగా.. ఈ ట్వీట్ పై వైసీపీ సోషల్ మీడియా కూడా వెరైటీగా రిప్లై ఇచ్చింది. వైసీపీ ట్వీట్ లో ఏముందంటే.. ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా.. మన రాష్ట్రంలో కోడికత్తి లాంటి పదునైన ఆయుధంతో ఎవరిపైనైనా దాడిచేసినా అది నేరం కాదని అధికారపార్టీ ప్రకటించిందండోయ్‌. ఆ దాడికారణంగా గాయమైనా, చికిత్సకోసం ఆస్పత్రిలో చేరినా.. దాన్ని పెద్దనేరంగా చూడాల్సిన అవసరంలేదని స్వయంగా పార్టీ ప్రకటించిందండోయ్‌ అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది. ఏపీనా మజాకా.. పొలిటికల్ పీక్స్.. ట్వీట్స్ కిరాక్స్ అంటున్నారు నెటిజన్లు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×