E-Paper
Advertisement

Kondapi : టీడీపీ ఎమ్మెల్యే Vs వైసీపీ ఇన్‌ఛార్జ్‌.. కొండపిలో హైటెన్షన్..

Kondapi : టీడీపీ ఎమ్మెల్యే Vs వైసీపీ ఇన్‌ఛార్జ్‌.. కొండపిలో హైటెన్షన్..
Advertisement

Kondapi : ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయుడుపాలెంలోని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు టంగుటూరులోని వైసీపీ కార్యాలయానికి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు
350 మంది పోలీసులను అక్కడ మోహరించారు.

Advertisement

మరోవైపు వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు కౌంటర్ గా నిరసనకు ప్రయత్నించారు.
టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి ఎమ్మెల్యే డోలా
ఆధ్వర్యంలో భారీగా టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. మార్గంమధ్యలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ సమయంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి రోడ్డుపైనే
బైఠాయించారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×