E-Paper
Advertisement

బహిరంగ చర్చకు సిద్ధమా..? ఎమ్మెల్యే బండారు శ్రావణికి కార్య‌క‌ర్త స‌వాల్‌

బహిరంగ చర్చకు సిద్ధమా..? ఎమ్మెల్యే బండారు శ్రావణికి  కార్య‌క‌ర్త స‌వాల్‌
Advertisement

Singanamala: శింగనమల రాజకీయాల్లో ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ అయింది. సాధారణంగా పార్టీలో ఎమ్మెల్యే మాటే శాసనం అని అందరూ అనుకుంటారు. కానీ, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. సొంత పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై గార్లదిన్నె మండలం కనుంపల్లికి చెందిన ప్రసాద్ అనే దళిత టీడీపీ కార్యకర్త గళం ఎత్తడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రసాద్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోను చూస్తే, ఒక కార్యకర్త ఎంతలా ఆవేదన చెందుతున్నాడో అర్థమవుతుంది. ఎమ్మెల్యే శ్రావణి అవినీతికి పాల్పడుతున్నారని, డబ్బు కోసం సొంత పార్టీ నేతలను, కార్యకర్తలను అణచివేస్తున్నారని ఆయన నేరుగా ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడితో ఆగకుండా, ‘మీరు చేసిన అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసరడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

Advertisement

అయితే ఈ గొడవకు అసలు కారణం ఇటీవల ఎమ్మెల్యే కనుంపల్లి గ్రామానికి వెళ్లినప్పుడు జరిగిన సంఘటన. తన గోడు చెప్పుకుందామని వెళ్లిన ప్రసాద్‌ను, అతని కుటుంబ సభ్యులను పోలీసులు ఈడ్చుకెళ్లడం కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఒక పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలను ఇలా అవమానించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పార్టీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా? లేదా ఎమ్మెల్యే ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్తే ఎమ్మెల్యేపై ఇలా తిరుగుబాటు చేయడం శ్రావణికి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.

Also Read:నువ్వు మొగోడివైతే చర్చకు రా.. బండి సంజయ్‌కి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్

Advertisement

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×