E-Paper
Advertisement

Macharla: మాచర్లలో టీడీపీ vs వైసీపీ.. రాళ్లు, రాడ్లు, సీసాలతో ఘర్షణ..

Macharla: మాచర్లలో టీడీపీ vs వైసీపీ.. రాళ్లు, రాడ్లు, సీసాలతో ఘర్షణ..
Advertisement

Macharla: అసలే పల్నాడు. అందులో మాచర్ల. తరుచూ రాజకీయ ఉద్రిక్తత. తాజాగా, మరోసారి మాచర్ల రణరంగంగా మారింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. గాజు సీసాలు విసురుకున్నారు. పదుల సంఖ్యలో కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు మాచర్లలో 144 సెక్షన్ విధించి పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

టీడీపీ వర్గీయులు ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తూ స్థానికంగా ప్రదర్శన చేపట్టారు. పోటీగా వైసీపీ శ్రేణులు సైతం ఏకమయ్యాయి. సడెన్ గా టీడీపీ ప్రదర్శనపై వైసీపీ వాళ్లు దాడికి దిగారు. వెంటనే తేరుకున్న తెలుగు తమ్ముళ్లు సైతం ఎదురుదాడి చేశారు. కర్రలతో కొట్టుకున్నారు. రాళ్లు, సీసాలు విసురుకున్నారు. వాహనాలు ధ్వంసం చేసుకున్నారు. ఇరువర్గాల ఘర్షణతో రాత్రి వేళలో మాచర్ల రణరంగంగా మారింది.

Advertisement

ఇంత గొడవ జరుగుతుంటే.. ఎప్పటిలానే పోలీసులు ఆలస్యంగా వచ్చారని అంటున్నారు. లాఠీఛార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిపైనా పోలీసులు లాఠీ ఎత్తారని ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులు బ్రహ్మారెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా పంపించివేశారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డిని గుంటూరుకు తరలించారు పోలీసులు. అయితే, బ్రహ్మారెడ్డిని తీసుకెళుతుండగా వైసీపీ వర్గీయులు ఆ వాహనాన్ని వెంబడించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మరోవైపు, మాచర్ల టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టడంతో పరిస్థితి చేజారిపోయింది. విషయం తెలిసి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఇరు పార్టీల కార్యకర్తలు మాచర్లకు చేరుకుంటున్నారు. పోలీసులు భారీగా మోహరించడంతో.. మాచర్లలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×