E-Paper
Advertisement

Gudiwada : రంగా వర్ధంతి .. గుడివాడలో టెన్షన్.. టెన్షన్..

Gudiwada : రంగా వర్ధంతి .. గుడివాడలో టెన్షన్.. టెన్షన్..
Advertisement

Gudiwada : వంగవీటి రంగా వర్ధంతి వేళ గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల ఆంక్షల మధ్యే టీడీపీ, జనసేన నేతలు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ఏజీకే స్కూలు వద్ద ఉన్న రంగా విగ్రహానికి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ రావి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పూలమాలలు వేశారు.

మాజీ మంత్రి కొడాలి నానిపై రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో తమ పార్టీ నేతలపై పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరింది కొడాలి నాని మనుషులేనని ఆరోపించారు. గత 25 ఏళ్లుగా గుడివాడలో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఇప్పుడే ఎందుకు వైసీపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించారని నిలదీశారు. రంగా ఏ ఒక్క సామాజికవర్గానికో చెందిన వ్యక్తి కాదని.. అందరివాడని అన్నారు. రౌడీయిజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా అని అన్నారు. కొడాలి నాని రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. ఆయన్ను గుడివాడ నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. పట్టణంలో రౌడీయిజాన్ని అంతం చేస్తామని రావి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

Advertisement

ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో ఉదయం నుంచి గుడివాడలో ఉత్కంఠ కొనసాగింది. టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. పోలీసుల ఆంక్షల నడుమే టీడీపీ నేతలు ఏజీకే స్కూలు వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు శరత్‌ టాకీస్‌ వద్ద వైసీపీ నేతలు రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పట్టణలో ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతి నిరాకరించారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×