BigTV English

Lalu Prasad Yadav : లాలూకు సీబీఐ షాక్‌.. మళ్లీ తెరపైకి ఆ స్కామ్ విచారణ..!

Lalu Prasad Yadav : లాలూకు సీబీఐ షాక్‌.. మళ్లీ తెరపైకి ఆ స్కామ్ విచారణ..!
Advertisement

Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ మెడకు మరో కేసు మళ్లీ చుట్టుకుంది. గతంలో విచారణ ముగించిన ఓ అవినీతి కేసు దర్యాప్తును సీబీఐ తిరిగి ప్రారంభించింది. లాలూ యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2018లో సీబీఐ విచారణ ప్రారంభించింది. 2021లో విచారణ ముగిసింది.


లాలూపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదు కాలేదని అప్పుడు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో లాలూతోపాటు ఆయన కుమారుడు, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, కుమార్తెలు చందా యాదవ్‌, రాగిణి యాదవ్‌ నిందితులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించాలని నిర్ణయించింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్‌కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందారు. కుమార్తె కిడ్నీ దానం చేయడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇదే సమయంలో సీబీఐ పాత కేసు దర్యాప్తు చేపట్టడం లాలూకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.


ఈ ఏడాది ఆగస్టులో బీజేపీతో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బంధం తెంచుకున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహా కూటమితో జత కట్టారు. ఆ రెండు పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తేజస్వికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే సీబీఐ పాత కేసు దర్యాప్తు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కోణంలోనే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి సీబీఐ ఈ కేసు దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళుతోందో చూడాలి. లాలూ కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలపై సీబీఐ, ఈడీ, ఐటీని కేంద్రం ప్రయోగిస్తుందనే విమర్శలు వస్తున్న సమయంలో లాలూపై పాత కేసు విచారణ మళ్లీ ప్రారంభించడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

Related News

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్

Transgenders Suicide Attempt: ఫినైల్ తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు.. అసలు ఏమైంది?

Heavy Rains: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం

Gujarat Ministers Resign: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా.. ఎందుకంటే?

Maoist Surrender: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్

Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య

Delhi News: కోర్టు ప్రొసీడింగ్స్.. మహిళకు కిస్ ఇచ్చిన లాయర్, సోషల్‌మీడియాలో రచ్చ, వీడియో వైరల్

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 27 మంది మావోయిస్టులు

Big Stories

×