BigTV English

YS Jagan: అలాంటి వాళ్లు రాజకీయాలకు అనర్హులు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: అలాంటి వాళ్లు రాజకీయాలకు అనర్హులు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: పేదలకు మంచి జరగకుండా టీపీడీ అధినేత చంద్రబాబు, లోకేశ్ చేస్తున్నాని సీఎం జగన్ ఆరోపించారు. రాజకీయం లబ్ధి కోసం మంగళగిరిలో పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల పంపిణీని వీరు కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకున్నారని అన్నారు.


ఓటు వేసే సమయంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం జగన్ మంగళిగిరిలో చేనేతలతో జరిగిన మూఖాముఖిలో వెల్లడించారు. ఎవరైతే ప్రజలకు అమ్మఒడి, చేయాత పథకాలు ఇస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. మంగళగిరిలో ఇళ్లు లేని పేదవారికి 54 వేల ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు తాము సిద్ధం అయితే.. చంద్రబాబు, లోకేశ్ కోర్టుకు వెళ్లి మరీ రాజకీయం కోసం అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు.

పేదలకు మంచి చేస్తే అడ్డుకునే ఏ ఒక్క రాజకీయ నాయుకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అవుతారని చంద్రబాబు, లోకేశ్ ను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారు. పేదలకు వైసీపీ ప్రభుత్వం అందించే రూ.10 లక్షల ఆస్తిని దక్కకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. అటువంటి వారు ఓటు అడగడానికి వస్తే వారిని నిలదీయాలని జగన్ అన్నారు.


మంగళగిరిలో చేనేత వర్గానికి అవకాశమిచ్చామని జగన్ తెలిపారు. మంగళగిరిలో పోటీ చేస్తున్న లావణ్యకు.. చంద్రబాబు కొడుకు దగ్గర ఉన్నంత డబ్బు లేదని అన్నారు. అయితే టీడీపీ వాళ్లు డబ్బు ఇస్తే తీసుకోవాలని.. కానీ ఓటు అనేది ఆలోచించి వేయాలన్నారు. మంగళగిరిలో టికెట్ ను వైసీపీ బీసీలకు కేటాయిస్తే.. టీడీపీ దాన్ని డబ్బుతో కొనడానికి చూస్తుందన్నారు.

Related News

Cyclone Alert: ఉత్తరాంధ్రను వణికించే న్యూస్.. రేపు మరింత డేంజర్?

Amaravati: వెల్కమ్ టు అమరావతి.. జగన్ కు టీడీపీ వెరైటీ ఛాలెంజ్

Rowdy Srikanth: నా భర్తది, శ్రీకాంత్‌ది సేమ్ ఉంటది.. అందుకే ఆస్పత్రిలో అలా చేశా

Nellore News: నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు.. తెర వెనుక ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం?

Tirumala ghat road: శ్రీవారి దర్శనంతో పాటు ప్రకృతి సోయగం.. వర్షాలతో శోభిల్లుతున్న తిరుమల!

YS Jagan: జగన్ మద్దతు కోరిన బీజేపీ.. కాదని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా?

Big Stories

×