E-Paper
Advertisement

Nellore: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. 2 గంటలు నదిలో ఈదిన డ్రైవర్

Nellore: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. 2 గంటలు నదిలో ఈదిన డ్రైవర్
Advertisement

Nellore: హీరో పరుగెడుతుంటాడు. వెనుకాల పోలీసులు ఛేజ్ చేస్తుంటారు. పరుగెడుతూ.. పరుగెడుతూ.. ఓ బ్రిడ్జి దగ్గర ఆగిపోతాడు. అప్పటికే పోలీసులు హీరోను చుట్టుముడుతారు. దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు హీరో బ్రిడ్జిపై నుంచి నదిలో దూకుతాడు. ఈదుకుంటూ వెళ్లి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఇటువంటి ఘటనలు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాము. అయితే సేమ్ టూ సేమ్ ఇలానే ఓ వ్యక్తి ప్రయత్నించాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

ఆదివారం ఇడిమేపల్లికి చెందిన కృష్ణ అనే వ్యక్తి టిప్పర్ నడుపుతూ.. తాటిపర్తి వద్ద ఓ ఆటోను ఢీ కొట్టాడు. వెంటనే అక్కడ జనాలు గుమికూడడంతో భయంతో టిప్పర్‌ను మరింత వేగంగా సంగం వైపు పోనిస్తూ దారిలో మళ్లీ ఓ గేదెను ఢీ కొట్టాడు. దీంతో వాహనాన్ని ఆపాలంటూ గ్రామస్థులు అతన్ని వెంబడించారు. కొంతదూరం వెళ్లాక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

దీంతో కృష్ణను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కొంతదూరం వెళ్లాక టిప్పర్‌ను రోడ్డు పక్కన ఆపి కనిగిరి జలాశయం కాలువలోకి దూకాడు కృష్ణ. ఈదుకుంటూ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా పోలీసులు అతడిని వదలలేదు. గట్టుపై పరుగెడుతూ అతడిని వెంబడించారు. దాదాపు రెండు గంటల పాటు కృష్ణ ఈదుకుంటూ ముందుకు వెళ్లాడు. మధ్యలో ఓ చెట్టును పట్టుకొని కాసేపు ఆగి మళ్లీ ఈదడం మొదలు పెట్టాడు. అలా మొత్తం 3 కిలోమీటర్ల వరకు ఈదుకుంటూ వెళ్లాడు.

దీంతో కృష్ణను పట్టుకునేందుకు పోలీసులు గజఈతగాళ్ల సాయం తీసుకున్నారు. వాళ్లు కాలువలోకి దిగి కృష్ణను పట్టుకున్నారు. ఒడ్డుకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కృష్ణను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×