BigTV English
Advertisement

Tirumala Alert: అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం.. మధ్యాహ్నం తర్వాత వారికి నో ఎంట్రీ

Tirumala Alert: అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం.. మధ్యాహ్నం తర్వాత వారికి నో ఎంట్రీ

Tirumala Alert: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన జారీ చేసింది. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుతల కదలికల కారణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరారు.


తిరుమల శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. అయితే అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిరుతల సంచారాన్ని అధికారులు, భక్తులు గుర్తించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు జాగ్రత్త భక్తులకు పలు సూచనలు జారీ చేశారు.

అలిపిరి నడక మార్గాన తిరుమలకు చేరుకునే భక్తులను సమూహాలలో అనుమతించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో ఉన్న నిబంధనల మేరకు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాధారణంగానే భక్తులను అలిపిరి నడక మార్గాన అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సమూహాల రూపంలో భక్తులను కొండపైకి అనుమతించడం జరుగుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.


Also Read: IRCTC AI Ticket Booking : ఇక రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీ.. కొత్త సిస్టం ప్రవేశ పెట్టిన భారతీయ రైల్వే

అలాగే మధ్యాహ్నం తర్వాత 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అలిపిరి నడక మార్గాన అనుమతించడం లేదని భక్తులు గుర్తించాలన్నారు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి నడక మార్గం మూసి వేయబడుతుందని, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.

Related News

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Big Stories

×