E-Paper
Advertisement

Tirumala Alert: అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం.. మధ్యాహ్నం తర్వాత వారికి నో ఎంట్రీ

Tirumala Alert: అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం.. మధ్యాహ్నం తర్వాత వారికి నో ఎంట్రీ
Advertisement

Tirumala Alert: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన జారీ చేసింది. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుతల కదలికల కారణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. అయితే అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిరుతల సంచారాన్ని అధికారులు, భక్తులు గుర్తించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు జాగ్రత్త భక్తులకు పలు సూచనలు జారీ చేశారు.

Advertisement

అలిపిరి నడక మార్గాన తిరుమలకు చేరుకునే భక్తులను సమూహాలలో అనుమతించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో ఉన్న నిబంధనల మేరకు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాధారణంగానే భక్తులను అలిపిరి నడక మార్గాన అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సమూహాల రూపంలో భక్తులను కొండపైకి అనుమతించడం జరుగుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.

Also Read: IRCTC AI Ticket Booking : ఇక రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీ.. కొత్త సిస్టం ప్రవేశ పెట్టిన భారతీయ రైల్వే

Advertisement

అలాగే మధ్యాహ్నం తర్వాత 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అలిపిరి నడక మార్గాన అనుమతించడం లేదని భక్తులు గుర్తించాలన్నారు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి నడక మార్గం మూసి వేయబడుతుందని, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×