BigTV English

Tirumala Alert: అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం.. మధ్యాహ్నం తర్వాత వారికి నో ఎంట్రీ

Tirumala Alert: అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం.. మధ్యాహ్నం తర్వాత వారికి నో ఎంట్రీ

Tirumala Alert: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన జారీ చేసింది. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుతల కదలికల కారణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరారు.


తిరుమల శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. అయితే అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిరుతల సంచారాన్ని అధికారులు, భక్తులు గుర్తించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు జాగ్రత్త భక్తులకు పలు సూచనలు జారీ చేశారు.

అలిపిరి నడక మార్గాన తిరుమలకు చేరుకునే భక్తులను సమూహాలలో అనుమతించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో ఉన్న నిబంధనల మేరకు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాధారణంగానే భక్తులను అలిపిరి నడక మార్గాన అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సమూహాల రూపంలో భక్తులను కొండపైకి అనుమతించడం జరుగుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.


Also Read: IRCTC AI Ticket Booking : ఇక రైల్వే టికెట్ల బుకింగ్ మరింత ఈజీ.. కొత్త సిస్టం ప్రవేశ పెట్టిన భారతీయ రైల్వే

అలాగే మధ్యాహ్నం తర్వాత 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అలిపిరి నడక మార్గాన అనుమతించడం లేదని భక్తులు గుర్తించాలన్నారు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి నడక మార్గం మూసి వేయబడుతుందని, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×