BigTV English
Advertisement

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Tirumala Brahmotsavam 2025: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పవిత్రమైన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే అత్యంత ప్రధానమైన ఉత్సవాలు. ఈ తొమ్మిది రోజుల పండుగలో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్‌ను ఇప్పుడు చూద్దాం.


బ్రహ్మోత్సవాల షెడ్యూల్ 2025:

సెప్టెంబర్ 23, మంగళవారం:
బ్రహ్మోత్సవాలు అధికారికంగా ప్రారంభమయ్యే ముందు రోజు రాత్రి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరిగే ఈ క్రతువులో.. విష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు నాంది పలుకుతారు.


సెప్టెంబర్ 24, బుధవారం – 1వ రోజు:
మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం ఉంటుంది. సాయంత్రం 5:45 గంటలకు ద్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా మొదలవుతాయి. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

సెప్టెంబర్ 25, గురువారం – 2వ రోజు:
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు చిన శేష వాహనంపై ఊరేగుతారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం (అభిషేకం) నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 వరకు స్వామివారు హంస వాహనంపై విహరిస్తారు.

సెప్టెంబర్ 26, శుక్రవారం – 3వ రోజు:
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సింహవాహనంపై దర్శనమిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు తిరిగి స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లకి వాహనంపై ఊరేగుతారు.

సెప్టెంబర్ 27, శనివారం – 4వ రోజు:
ఉదయం 8 నుంచి10 గంటల వరకు కల్ప వృక్ష వాహనంపై ఊరేగింపు ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామివారు ఊరేగుతారు.

సెప్టెంబర్ 28, ఆదివారం – 5వ రోజు :
ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైనది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 6:30 నుంచి 11:30 వరకు అత్యంత ప్రాధాన్యత కలిగిన గరుడ వాహన సేవ జరుగుతుంది.

Also Read: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

సెప్టెంబర్ 29, సోమవారం – 6వ రోజు:
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగుతారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం ఉంటుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు.

సెప్టెంబర్ 30, మంగళవారం – 7వ రోజు:
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సూర్య ప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు చంద్ర ప్రభ వాహనంపై దర్శనమిస్తారు.

అక్టోబర్ 1, బుధవారం – 8వ రోజు:
ఉదయం సుమారు 6 గంటలకు రథోత్సవం వైభవంగా జరుగుతుంది. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు అశ్వ వాహనంపై ఊరేగింపు ఉంటుంది.

అక్టోబర్ 2, గురువారం – 9వ రోజు:
ఇది బ్రహ్మోత్సవాల చివరి రోజు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం సుమారు 7 గంటలకు ద్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×