Tirumala Controversy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. గత కొన్నిరోజులుగా తిరుమల చుట్టూ తిరుగుతున్నాయి. సాధారణంగా దేవుళ్ల చుట్టూ రాజకీయ పంచాయతీలు ఏపీలో చాలా అరుదుగా చూస్తుంటాం. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడు కొండల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ప్రస్తుతం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి, జంతుకొవ్వు వివాదం, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు వీడియోలతో గత కొన్ని రోజులుగా నిత్యం టీటీడీ ఆలయం వార్తల్లో నిలుస్తూనే ఉంది. సరే ఇకనైనా ఈ వివాదం ముగుస్తుందనుకున్న తరుణంలో వైసీపీ మళ్లీ ఇంకో సరికొత్త ఆరోపణలతో మళ్లీ శ్రీవారిని వార్తల్లోకి లాగింది.
కూటమి ప్రభుత్వ హయాంలో పరకామణిలో రూ.కోటి విలువైన 555 గ్రాముల బంగారం చోరీ జరిగిందంటూ విపక్ష వైసీపీ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేసింది. 157 గ్రామాల వెండి కానుకలు సైతం చోరీకి గురైనట్లు విమర్శలు చేసింది. శ్రీవారి సొత్తును దోచుకుంటూ పరకామణి ఉద్యోగి పెంచలయ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని.. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దర్జాగా దొంగతనాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపించింది. పరకామణి దొంగలకు ప్రభుత్వ పెద్దల దన్నుగా నిలుస్తున్నారని పేర్కొంది. దీనిపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీసింది.
పరకామణిలో జరిగిన చోరీపై@ncbn ష్.. గప్ చుప్!🚨
పరకామణిలో రూ.కోటి విలువైన 555 గ్రాముల బంగారం
157 గ్రామాల వెండి కానుకల చోరీ
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య
2024లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దర్జాగా దొంగతనాలు. పరకామణిలో… pic.twitter.com/2wb1zGf7Sc— YSR Congress Party (@YSRCParty) March 10, 2026
సాధారణంగా రాజకీయ పార్టీలు.. పాలసీలు, పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల కేంద్రంగా ఆరోపణలు చేసుకుంటాయి. కానీ ఏపీలో కొద్దిరోజులుగా టీటీడీ కేంద్రంగా మాటల యుద్ధానికి దిగడంపై శ్రీవారి భక్తులకు రుచించడం లేదు. ఆఖరికి ఆ పార్టీకి చెందిన కేడర్ సైతం.. తమ అధినేతలు అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పరమ పవిత్రమైన శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశ, విదేశాల నుంచి వచ్చి స్వామివారికి మెుక్కులు చెల్లించుకుంటారు. కలియుగ దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. అలాంటి తిరుమలను ఇలా రాజకీయ విమర్శలకు వాడుకొని.. టీటీడీ ప్రతిష్టను పలుచన చేయవద్దని రాజకీయ నిపుణులు, భక్తులు కోరుకుంటున్నారు.
Also Read: Portable AC Offers: అమేజింగ్ సమ్మర్ సేల్.. అత్యంత చౌకగా పోర్టబుల్ ఏసీలు.. భలే ఛాన్సులే!
రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే టీటీడీలో ఏదైనా అవకతవకలు చోటుచేసుకుంటే.. దానిపై సైలెంట్ గా దర్యాప్తు చేయాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న శ్రీవారి లడ్డు, పరకామణి కానుకల అంశాన్ని ప్రెస్ మీట్లు పెట్టి మరీ రచ్చ చేయకుండా.. తెరవెనుక ఫిర్యాదుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. టీటీడీ చుట్టూ ఇలాగే రాజకీయ రచ్చ కొనసాగిస్తూ పోతే.. మెుదటికే మోసానికి వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీలోని శ్రీవారి భక్తుల్లో అసహనం, అసంతృప్తి కట్టలు తెంచుకుంటే అది.. పార్టీల భవితవ్యాన్ని, నేతల రాజకీయ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Also Read: Richest Actresses: టాప్ 10 అత్యధిక ధనవంతుల జాబితా.. మీ ఫేవరెట్ హీరోయిన్ ఆస్తి ఎంతంటే?