E-Paper
Advertisement

Kalvakuntla Kavitha: పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!

Kalvakuntla Kavitha: పేదల గుడిసెలు కూల్చి.. పెద్దలకు కట్టబెడతారా? కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటం ఉధృతమైంది.

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పరిధిలోని 62 ఎకరాల భూదాన్ భూమిలో గత పదేళ్లుగా సుమారు 750 పేద కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, ఈ భూమి విలువ పెరగడంతో సంపన్నులకు కట్టబెట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అర్థరాత్రి వేళ బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేసింది. నిరాశ్రయులైన బాధితులను ప్రభుత్వం స్థానిక అంబేద్కర్ భవన్‌కు తరలించి గాలికి వదిలేసింది. వందలాది కుటుంబాలు ఒకే చోట సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నా, జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వం కానీ స్పందించకపోవడం గమనార్హం.

Advertisement

బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత, డాక్టర్ విశారదన్ , బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్లతో కలిసి ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనను అణచివేసేందుకు పోలీసులు అమానుషంగా వ్యవహరించి వారిని అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి కవిత నిరాహార దీక్ష చేపట్టగా.. అర్ధరాత్రి వేళ వేలమంది పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా హైదరాబాద్‌కు తరలించి జాగృతి కేంద్ర కార్యాలయంలో వదిలిపెట్టారు. ప్రస్తుతం ఆమె తన దీక్షను అక్కడే కొనసాగిస్తున్నారు.

తెలంగాణ జాగృతి ఈ సందర్భంగా ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ‘ఇళ్లు కూల్చివేసిన చోటే పేదలకు ప్లాట్లు కేటాయించి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ భూ కుంభకోణంపై స్వతంత్ర జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల హస్తం దీని వెనుక ఉందని బాధితులు బలంగా నమ్ముతున్నారు’. రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలో పేదల ఇళ్లను ధ్వంసం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ జాగృతి లేఖ రాసింది.

Advertisement

పేదల భూములను పెద్దలకు కట్టబెట్టే ఈ ‘ప్రజా వ్యతిరేక’ విధానాలపై పోరాటం ఆగదని, బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

Also Read:  మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×