BigTV English

TTD News: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మార్క్ షురూ.. భక్తుల హర్షం.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

TTD News: తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మార్క్ షురూ.. భక్తుల హర్షం.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

TTD News: తిరుమల పవిత్రతను కాపాడడంలో ఏ చిన్న నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చినా సహించనని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించిన నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి శ్రీవారి దర్శనం కలిగేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈవో శ్యామలరావు సారథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటుండగా, భక్తులు సైతం టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్న పరిస్థితి తిరుమలలో నెలకొని ఉంది. తొలి పాలక మండలి సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు తనదైన మార్క్ తో కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు.


ఇక,
అసలే కార్తీకమాసం. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.

ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.


Also Read: Vizag Glass Bridge: దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి, విశాఖ కైలాసగిరిపై నిర్మాణ పనులు షురూ

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 62,085 మంది భక్తులు దర్శించుకోగా.. 21,335 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.78 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Related News

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Big Stories

×