E-Paper
Advertisement

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. బాధితులకు నష్టపరిహారం అందించిన టీటీడీ

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. బాధితులకు నష్టపరిహారం అందించిన టీటీడీ

Tirupati Stampede: గత కొద్ది రోజుల క్రితం.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశం ద్వారా.. మృత కుటుంబాలకు పాతిక లక్షల చెక్కులు పంచడం, మృతుల కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వడం, బాధిత కుటుంబాల పిల్లల చదువు బాధ్యత టీటీడీ తీసుకునే పలు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది.

వాడి వేడిగా సాగిన ఈ సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సభ్యులు. విజిలెన్స్ విచారణ తర్వాత బాధ్యులపై కఠిన చర్యలుంటాయని అన్నారు టీటీడీ బోర్డు చైర్మన్. టీటీడీ అధికారులు పాలకమండలి సభ్యులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్న మాట వాస్తవమేననీ.. త్వరలో ఆయా జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిదుల నేతృతంలో మృతుల కుటుంబాలకి చెక్కులు పంపిణీ చేస్తానీ అన్నారు పాలక మండలి చైర్మన్.

ఈ ఘటన జరగకుండా ఉండాల్సిందనీ.. ఒకరిద్దరు చేసిన పొరబాటు వల్ల జరిగిన దురదృష్టకరమైన ఘటనగా చెప్పారు చైర్మన్. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామనీ. ఎంత చేసినా బాధిత కుటుంబాలకు జరిగిన నష్టం తిరిగి పూడ్చలేదనీ. ముఖ్యమంత్రి ఆదేశాలు పూర్తిగా పాటిస్తామనీ. ఇవన్నీ జరగడం ఒక ఎత్తు. వచ్చే రోజుల్లో మేము తీసుకోబోయే జాగ్రత్తలు మరొక ఎత్తనీ. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కావాలని జరిగిన ఘటనా? త్వరలో తేలనుందని.. బాధ్యులెవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదని అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.

Also Read: ఏడు కొండలవాడా ఏంటీ ఘోరం.. తొక్కిసలాట ఘటనకు కారకులెవరు?

ఈ తరుణంలో.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులకు నష్టపరిపరిహారం అందించింది టీటీడీ పాలక మండలి. నష్టపరిహారంతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈరోజు స్విమ్స్ లో చికిత్స పొందుతున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున.. స్వల్పంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అందజేశారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×