E-Paper
Advertisement

అనుమానం పెనుభూతం.. ఆ ఇంటి దీపం ఆర్పేసింది, ఏకంగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య

అనుమానం పెనుభూతం.. ఆ ఇంటి దీపం ఆర్పేసింది, ఏకంగా ముగ్గురు మహిళలు ఆత్మహత్య
Advertisement

Vijayawada: అనుమానం పెనుభూతం అయ్యింది. ఫ్యామిలీలో ఏమైనా చిన్ని చిన్న సమస్యలుంటే భార్యాభర్తలు కూర్చొని చర్చించుకుంటే బాగుండేది. కానీ భార్యపై అనుమానం పడ్డాడు. చివరకు భర్త వేధింపులు తట్టకోలేక కృష్ణాజిల్లాలో తల్లి-కూతురు-కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది?

కృష్ణా జిల్లాలో దారుణం.. ఓ ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య

Advertisement

కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయిపేటకు చెందిన అనుముకొండ కృష్ణ-రజనీకుమారి దంపతులు ఉండేవారు. ఈ దంపతులకు దేవచంద్రరాజు-గౌరి పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు కిందట వారిద్దరికీ వివాహం చేశారు. కూతురు గౌరి ఫ్యామిలీ కత్తలవారిపాలెంలో నివాసం ఉంటోంది. కొడుకు దేవచంద్రరాజు.. దగ్గర బంధువు కూతురు నరసన్నపాలేనికి చెందిన మధుబాలతో వివాహం జరిపించారు.

దేవచంద్రరాజు-మధుబాల దంపతులకు కొడుకు-కూతురు ఉన్నారు. సీన్ కట్ చేస్తే.. పుట్టింటికి తరచూ వచ్చేది కూతురు గౌరి. తల్లి, వదినతో సరదాగా ఉండేది. వీరిని చూసి ఊరు ప్రజలు ఆడిపోసుకునేవారు. తమకు అలాంటి కూతురు, కోడలు ఉంటే బాగుండేదని భావించేవారు ఇరుగుపొరుగువాళ్లు. కొన్నాళ్లుగా దేవచంద్రరాజు.. తన భార్య మధుబాలను అనుమానించడం మొదలుపెట్టాడాడు.

Advertisement

అత్త-కోడలు-కూతురు..  వివరాలు సేకరిస్తున్న పోలీసులు

అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. ఆ తర్వాత వేధించడం మొదలుపెట్టాడు. కొడలకు వత్తాసు పలుకుతున్నారంటూ తల్లి-చెల్లిని దుర్భాషలాడేవాడు దేవ చంద్రరాజు. రోజు రోజుకూ కొడుకు వేధింపులు తట్టుకోలేక వారం కిందట తల్లి రజనీకుమారి, కొడలు మధుబాల, చెల్లి గౌరి గూడూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారం చివరకు ఊరు పెద్దల వరకు వెళ్లింది. కొద్దిరోజులపాటు గ్రామంలో వేరుగా ఉండాలని దేవచంద్రరాజుకు సూచించారు. రెండు రోజుల కిందట గౌరి పుట్టింటికి వచ్చింది. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముగ్గురు మహిళలు గదుల్లో చున్నీలతో ఉరేసుకున్నారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ALSO READ:  బంగాళాఖాతంలో అల్లకల్లోలం.. వేటకు వెళ్లి ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముగ్గురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వెనుక కుటుంబ కలహాలు-ఆర్థిక ఇబ్బందులు- వ్యక్తిగత సమస్యలు అనేదానిపై సమగ్ర విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

Related News

‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!

అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ ఇచ్చిన సీఎం!

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు

దేవుడా.. వీళ్లా మాకు నాయకులు? కూటమి వైఖరిపై సభలోనే బొత్స ఆవేదన!

గుడి లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా.. వైసీపీపై చంద్రబాబు ఫైర్!

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి!

టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం

Big Stories

Advertisement
×