TTD Darshan: స్కూళ్లకు వేసవి సెలవులు ముగియడంతో పాటుగా వారాంతం రావడంతో తిరుమలలో భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో పెరిగిపోయారు. దీంతో అధిక రద్దీ కారణంగా ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించడం కోసం ఆది, సోమవారం రోజున తిరుమలలో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ దేవస్థానం అధికారికంగా తెలియచేసింది. దీంతో వీఐపి దర్షనాలు బ్రేక్ వేసినట్టు టీటీడీ దేవస్ధాన అధికారులు తెలిపారు.
దీనితో పాటుగా ఆన్ లైన్లో బుకింగ్లో కూడా ఎరోజు కారోజు జారీ చేసే (800) శ్రీవారి దర్షన టికేట్లను కూడా రెండు రోజుల పాటు అనగా ఆది, సోమవారం రోజులలో వాటిని కూడా రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో తిరుమల యాత్రకు రావాలను కున్న భక్తులు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని టీటీడీ అధికారులు తెలిపారు.
Also read: ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!
ప్రస్థుతం తిరుమలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, మరియు బైట క్యూలైన్లు నిండి బాలాజీ నగర్ ప్రాంతం వరకు శ్రీవారి దర్శనం కోసం భక్తుల వేచి ఉన్నారు. దీంతో తిరుమలకు ఇంకా వేలాదిమంది భక్తులు వచ్చే అవకాశ ఉందని టీటీడీ సీనియర్ అధికారులు తెలిపారు. భక్తులకు అన్నీ సౌకర్యాలు చూస్తూ నిరంతం వారిని పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు అక్కడ చర్యలు చేపడుతున్నారు.
Also read: Gandhi Hospital: గాంధీ హాస్పిటల్లో అడుగడుగునా లంచాల దందా.. రాబంధుల్లా పీక్కుతింటున్న సిబ్బంది..!