Ananthababu: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో భాగంగా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. పోలీసులు ఆయనను కడా భద్రత నడుమ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.
కోర్టులో సాక్షుల విచారణ
ఈ కేసు విచారణలో భాగంగా ఇవాళ ముగ్గురు సాక్షులను కోర్టు విచారించింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు విచారించిన సాక్షుల సంఖ్య 14కి చేరింది. మొత్తం 87 మంది సాక్షులు ఉండగా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల (ఆగస్టు) 31వ తేదీ నాటికి సాక్షుల విచారణ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అందుకనుగుణంగానే రోజువారీ విచారణ వేగవంతంగా సాగుతోంది.
మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు
ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలను మండలిలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, అందుకోసం తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు దరఖాస్తు దాఖలు చేశారు.
బెయిల్ ఇవ్వొద్దని బాధితుల లాయర్ వినతి
అయితే అనంతబాబుకు ఎలాంటి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని బాధితుల తరఫు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు కోర్టును తీవ్రంగా కోరారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కోణాన్ని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఉభయ పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. అనంతబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసినట్లు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వెల్లడించారు.
Also Read: మేడిగడ్డ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్కు మళ్లీ సమన్లు జారీ చేసిన జిల్లా కోర్టు!