Gambhir Warns Shreyas Iyer: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs Team India) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) జరుగుతోంది. ఈ సిరీస్ లో భాగంగా నిన్న తొలి మ్యాచ్ జరగగా, పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో టీమిండియా జట్టును దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 T20 World Cup tournament) గెలిచి సత్తా చాటిన టీమిండియా, అనామక ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం ఏంటని ఆడుకుంటున్నారు. అయితే దీనిపై గౌతమ్ గంభీర్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో గొడవకు కూడా దిగాడట గౌతమ్ గంభీర్. దాదాపు 30 నిమిషాల పాటు ఇద్దరు తన్నుకునే అంత గొడవ జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లలో టీమిండియా గెలవకపోతే కెప్టెన్సీ కూడా పీకి పారేస్తానని హెచ్చరించారట గౌతమ్ గంభీర్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా… పసికూన ఐర్లాండ్ చేతిలో 34 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఐర్లాండ్ విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని కూడా చేదించలేక చేతులెత్తేసింది. ఐర్లాండ్ జట్టులో ఐదుగురు కీలక ప్లేయర్లు గాయాల బారిన పడగా… పిల్ల బచ్చాలు బరిలోకి దిగారు. అయినప్పటికీ టీమిండియా మాత్రం గెలవలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
ఇద్దరి మధ్య దాదాపు 30 నిమిషాల పాటు గొడవ జరిగినట్టు చెబుతున్నారు. మధ్యలో బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ జోక్యం చేసుకున్నప్పటికీ… గంభీర్ బండ బూతులు తిట్టాడట. డ్రెస్సింగ్ రూమ్ లో గొడవ అనంతరం శ్రేయస్ అయ్యర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట కోచ్ గౌతమ్ గంభీర్. ఐర్లాండ్ తో మిగిలిన టి20.. ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టీ20 లో సిరీస్ లో టీమిండియా కచ్చితంగా గెలవాలని దిశా నిర్దేశం చేశారట. ఒకవేళ టీమ్ ఇండియా గెలవకపోతే, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ని తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారట గంభీర్. ఆ తర్వాత గొడవ కాస్త చల్లారినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ మ్యాచ్ లపై శ్రేయస్ అయ్యర్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.
శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్సీ నుంచి కావాలనే తొలగించాలని గంభీర్ కుట్రకు తెరలేపినట్లు మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. ప్రసిద్ కృష్ణ , వాషింగ్టన్ సుందర్ లాంటి క్రికెటర్లను మొదటి టీ20 లో వద్దని శ్రేయస్ అయ్యర్ మొత్తుకున్నారట. అలాగే వైభవ్ సూర్యవంశీని మొదటి మ్యాచ్ లోనే బరిలోకి దింపాలని శ్రేయస్ అయ్యర్ భావించారట. కానీ గౌతమ్ గంభీర్ అడ్డుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లలో శ్రేయస్ అయ్యర్ ను ఫెయిల్యూర్ కెప్టెన్ గా ముద్రించే కుట్ర గౌతమ్ గంభీర్ చేస్తున్నట్లు మరి కొంతమంది అంటున్నారు. అందుకే తుది జట్టు ఎంపికలో వేలు పెట్టి, శ్రేయస్ అయ్యర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా చేస్తున్నాడట. దాని ఫలితమే మొదటి టీ20 అని అంటున్నారు. గౌతమ్ గంభీర్ వేలు పెట్టినన్ని రోజులు శ్రేయస్ అయ్యర్ సక్సెస్ కావడం కష్టమే అని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.