BigTV English
Advertisement

TTD on Roja: మాజీ మంత్రి రోజాకు షాక్.. అంతా అవకతవకలేనంటూ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన

TTD on Roja: మాజీ మంత్రి రోజాకు షాక్.. అంతా అవకతవకలేనంటూ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన

TTD on Roja: మాజీ మంత్రి రోజాకు టీటీడీ పాలకమండలి షాకిచ్చింది. ఏపీ టూరిజం శాఖ మంత్రిగా రోజా ఉన్న సమయంలో శ్రీవారి దర్శనం టూరిజం టికెట్ల ద్వారా అవతవకలు జరిగాయని భావించిన పాలకమండలి, టూరిజం టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో టూరిజం శాఖలో రూ. 400 కోట్ల వరకు స్కామ్ జరిగిందని తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపణలు గుప్పించారు. శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో టూర్ ప్యాకేజీ గతంలో 24 బస్సులకు పర్మిషన్ ఇవ్వగా, అందులో తక్కువ సంఖ్యలో బస్సులు తిరిగినట్లు గతంలో కిరణ్ రాయల్ విమర్శించారు. ఇలా ఆ టికెట్ల కేటాయింపుపై విమర్శలు అధిక సంఖ్యలో వినిపించాయి. ఈ నేపథ్యంలో టూరిజం శాఖలకు కేటాయించే టికెట్ల విషయంపై పాలకమండలిలో తీవ్ర చర్చ సాగింది.

పాలకమండలిలో చర్చ అనంతరం టూరిజం శాఖ టికెట్లను రద్దు చేస్తున్నట్లు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు ప్రకటించారు. టూరిజం శాఖ టికెట్ల ద్వారా గతంలో ఔకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. టూరిజం శాఖ ద్వారా అనుమతులు పొందిన ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూములను సైతం రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకోవడం విశేషం.


గతంలో ఏపీ టూరిజంతో కర్ణాటక తెలంగాణ తమిళనాడు టూరిజం శాఖల నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించిన క్రమంలో, ఆ నివేదికల ఆధారంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్ గా తొలిసారి పాలక మండలి సమావేశం నిర్వహించిన బీఆర్ నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Also Read: TTD Key Decisions: అన్యమత ఉద్యోగులు ఇక ఇంటికే.. కీలక నిర్ణయాలతో.. షాకిచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

టీటీడీ 54వ టీటీడీ పాలకమండలి మొదటి సమావేశం కావడంతో, పాలక మండలి సభ్యులందరూ హాజరయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో సభ్యులందరూ భాగస్వామ్యం కావాలని, అధికారులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని బీ.ఆర్ నాయుడు అన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని తాము అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు, తిరుమల పవిత్రతను కాపాడేందుకు తమ వంతు భాద్యతగా వ్యవహరిస్తామని తెలిపారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×