E-Paper
Advertisement

TTD on Roja: మాజీ మంత్రి రోజాకు షాక్.. అంతా అవకతవకలేనంటూ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన

TTD on Roja: మాజీ మంత్రి రోజాకు షాక్.. అంతా అవకతవకలేనంటూ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన
Advertisement

TTD on Roja: మాజీ మంత్రి రోజాకు టీటీడీ పాలకమండలి షాకిచ్చింది. ఏపీ టూరిజం శాఖ మంత్రిగా రోజా ఉన్న సమయంలో శ్రీవారి దర్శనం టూరిజం టికెట్ల ద్వారా అవతవకలు జరిగాయని భావించిన పాలకమండలి, టూరిజం టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో టూరిజం శాఖలో రూ. 400 కోట్ల వరకు స్కామ్ జరిగిందని తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపణలు గుప్పించారు. శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో టూర్ ప్యాకేజీ గతంలో 24 బస్సులకు పర్మిషన్ ఇవ్వగా, అందులో తక్కువ సంఖ్యలో బస్సులు తిరిగినట్లు గతంలో కిరణ్ రాయల్ విమర్శించారు. ఇలా ఆ టికెట్ల కేటాయింపుపై విమర్శలు అధిక సంఖ్యలో వినిపించాయి. ఈ నేపథ్యంలో టూరిజం శాఖలకు కేటాయించే టికెట్ల విషయంపై పాలకమండలిలో తీవ్ర చర్చ సాగింది.

Advertisement

పాలకమండలిలో చర్చ అనంతరం టూరిజం శాఖ టికెట్లను రద్దు చేస్తున్నట్లు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు ప్రకటించారు. టూరిజం శాఖ టికెట్ల ద్వారా గతంలో ఔకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. టూరిజం శాఖ ద్వారా అనుమతులు పొందిన ముంతాజ్ హోటల్ కు కేటాయించిన భూములను సైతం రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకోవడం విశేషం.

గతంలో ఏపీ టూరిజంతో కర్ణాటక తెలంగాణ తమిళనాడు టూరిజం శాఖల నుండి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించిన క్రమంలో, ఆ నివేదికల ఆధారంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ చైర్మన్ గా తొలిసారి పాలక మండలి సమావేశం నిర్వహించిన బీఆర్ నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

Also Read: TTD Key Decisions: అన్యమత ఉద్యోగులు ఇక ఇంటికే.. కీలక నిర్ణయాలతో.. షాకిచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

టీటీడీ 54వ టీటీడీ పాలకమండలి మొదటి సమావేశం కావడంతో, పాలక మండలి సభ్యులందరూ హాజరయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో సభ్యులందరూ భాగస్వామ్యం కావాలని, అధికారులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని బీ.ఆర్ నాయుడు అన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని తాము అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు, తిరుమల పవిత్రతను కాపాడేందుకు తమ వంతు భాద్యతగా వ్యవహరిస్తామని తెలిపారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×