BigTV English
Advertisement

Vaikunta Dwara Darshan: నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం

Vaikunta Dwara Darshan: నెరవేరిన బాధితుల కోరిక.. తిరుమలలో స్పెషల్‌గా వైకుంఠ దర్శనం

Vaikunta Dwara Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే చేసిన పాపాలు కొంతైనా తొలగుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సుదూర ప్రాంతాల నుంచి దర్శించుకునేందుకు భక్తులు ఏడు కొండలకు వస్తుంటారు. ఈ క్రమంలో అనుకోని ఘటనలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి తిరుపతి టికెట్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాధితులు స్పెషల్‌గా వైకుంఠ ద్వారం ద్వారా దేవ దేవుడ్ని దర్శించుకున్నారు.


తిరుపతిలో వైకుంఠ దర్శన టికెట్ల కేంద్రాల వద్ద జరగిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. స్వయంగా సీఎం చంద్రబాబు బాధితులతో మాట్లాడారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

శుక్రవారం వైకుంఠం ద్వారా స్వామిని దర్శించుకుంటామని చెప్పడంతో అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఉదయం ఏడు గంటలకే క్షతగాత్రులకు వైకుంఠ ద్వారం దర్శనం చేయించింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దర్శనం తర్వాత బాధితులు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.


తాము ఎనిమిది సార్లు ఇక్కడకు వచ్చామని, అనుకోకుండా ఇలాంటి ఘటన జరిగింద న్నారు బాధితులు. ఎప్పుడూ ఈ విధంగా జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు కారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ప్రత్యేకంగా వైకుంఠం ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి మొదలు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాము బతికామంటే స్వామి దయవల్లేనని చెప్పుకొచ్చారు బాధితులు.

ALSO READ: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.. టీటీడీ కీలక ప్రకటన ఇదే!

 

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×