E-Paper
Advertisement

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..
Advertisement

Budameru Floods| గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు బుడమేరు వాగు వరద ప్రభావంతో విజయవాడ భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. అయితే బుడమేరు వాగు గండిని పూడ్చివేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన పనులు ప్రారంభించి.. విజయవంతంగా మూడు గండ్లను పూడ్చివేసింది. మూడో గండిని శనివారం పూడ్చివేయడంతో పనులు పూర్తయ్యాయి. పూడ్చివేత పనులు జరగడంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు.

బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో జరిగాయి. పనులు పూర్తి చేసినట్లుగా మంత్రి నారా లోకేశ్ పరిశీలించి వెల్లడించారు. ఇటీవల ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు 60వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో బుడమేరు డైవర్షన్‌ చానెల్‌కు గండ్లు పడ్డాయి. అయితే ఈ గండ్ల పూడ్చి వేత పనుల్లో ఆర్మీ జవాన్లు కూడా పాల్పంచుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్‌ బెటాలియన్‌, చెన్నైకు చెందిన 6వ బెటాలియన్ జవాన్లు మొత్తం 120 మంది కలిసి మూడో గండి పూడ్చివేత పనులు చేశారు.

Advertisement

బుడమేరు గండ్లు.. ఇబ్రహీంపట్నం సమీపంలో కవూలూరు వద్ద బీడీసీకి ఎడమవైపు కట్టకు పడ్డాయి. అయితే ఇందులో మూడో గండి చాలా పెద్దది. దాదాపు 100 మీటర్ల పొడవు ఉండడంతో మట్టితో నింపినా నీటి ప్రవాహం ఆగలేదు. పరిస్థితి సీరియస్ కవాడంతో మేఘా ఇంజినీరింగ్, వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్ కలిసి కొండపల్లి క్వారీల నుంచి గ్రావెల్, రాళ్లు తెచ్చి గండి పూడ్చివేత పనులు ప్రారంభించారు. కానీ పూడ్చివేత సమయంలో మధ్యలో శుక్రవారం కూడా వర్షం పడడంతో పనులకు అంతరాయం కలిగింది. పైగా బీడీసీలో 15 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తూ ఉండడం మరో సవాల్ గా మారింది. అందుకే మట్టి నింపినా ఉపయోగం లేకపోవడంతో రాళ్లు పోసి ఆ తరువాత మట్టితో నింపారు. గండ్లను పటిష్టం చేసేందుకు కంకర పోసి ఆ తరువాత గ్రావెల్ తో కూడా నింపారు.

Also Read: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..

Advertisement

గండ్లు పూడ్చివేత పనులు పూర్తి కావడంతో విజయవాడకు వరద సమస్య నుంచి ఉపశమనం లభించింది. విజయవంతంగా గండ్ల పూడ్చి వేత పనులు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, మంత్రులను అభినందించారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×