E-Paper
Advertisement

Visakha: విశాఖ నగరానికి మరో శుభవార్త.. ఆగస్టు ఒకటి నుంచి విమాన సర్వీసులు

Visakha: విశాఖ నగరానికి మరో శుభవార్త.. ఆగస్టు ఒకటి నుంచి విమాన సర్వీసులు
Advertisement

Visakha: కేవలం అభివృద్ధిపై కాకుండా.. రైళ్లు- విమాన సర్వీసులపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. తాజాగా విశాఖ సిటీ నుంచి కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వారంలో మూడు రోజులు సోమ, శుక్ర, శనివారాల్లో నడవనున్నాయి. విశాఖపట్నం-ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి.

కొత్త విమాన సర్వీసులను ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఆగస్టు ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తాయి. విశాఖ నుంచి ఉదయం 8 గంటలకు విమానం బయలుదేరి 10 గంటలకు పోర్ట్‌ బ్లెయిర్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉదయం 10.30కి బయలుదేరి మధ్యాహ్నం 12.25కు విశాఖకు రానుంది.

Advertisement

మరో సర్వీసు ముంబై నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది. మళ్లీ విశాఖలో ఉదయం 9.40 గంటలకు బయలుదేరుతుంది. సర్వీసుల వివరాలను విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. టికెట్ల విక్రయాలు ఇప్పటికే మొదలయ్యాయి.

అన్నట్లు విశాఖ టు ముంబై మధ్య సాయంత్రం ఓ సర్వీసు నడుస్తోంది. ఆగష్టు ఒకటి నుంచి ఉదయం వేళ మరో సర్వీస్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచన చేశారు. ఇటీవల కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు మొదలయ్యాయి. వారంలో మూడు రోజులపాటు ఆయా సర్వీసులను ఇండిగో నడుపుతోంది.

Advertisement

ALSO READ: సినిమాలు చేయడం ఎందుకు? మరో మూడేళ్లున్న జగన్

ప్రతి రోజూ విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు చేపడతామన్నది కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట. జూన్ నుంచి విశాఖ-అబుదాబికి, విశాఖ నుంచి భువనేశ్వర్‌కు సర్వీసులు నడుస్తున్నాయి. విజయవాడ – బెంగళూరుకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎయిర్ కనెక్టివిటీ క్రమంగా మెరుగుపడుతోంది.

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×