BigTV English
Advertisement

Vishnu Kumar Raju: కూర్చొంటే చాలు అదే కడిగేస్తది.. రుషికొండ ప్యాలెస్‌ టాయిలెట్‌పై విష్ణు రాజు పంచ్‌లు

Vishnu Kumar Raju: కూర్చొంటే చాలు అదే కడిగేస్తది.. రుషికొండ ప్యాలెస్‌ టాయిలెట్‌పై విష్ణు రాజు పంచ్‌లు

MLA Vishnu Kumar Raju: ఏపీ అసెంబ్లీ సీరియస్ గా సాగుతోంది. అంతలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మైక్ అందుకున్నారు. ఇక అంతే సభ మొత్తం నవ్వులే నవ్వుల్. అది కూడా స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం లతో సహా..


వైజాగ్ లో రుషికొండ ప్యాలెస్ గురించి తెలియని వారుంటారా చెప్పండి. కూటమి విజయాన్ని అందుకున్న అనంతరం.. ఫేమస్ గా నిలిచిన ప్యాలెస్ ఇది. దీనికి కారణం ఎన్నికల ముందు వరకు అసలు ఈ ప్యాలెస్ దరిదాపుల్లోకి కూడా ఎవరికీ అనుమతి లేకపోవడమే. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారగా, రుషికొండ ప్యాలెస్ నిగ్గు తేల్చేందుకు మీడియాతో రంగప్రవేశం చేశారు టీడీపీ నేతలు. అందులో ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలిచింది ఏదో కాదు.. అక్కడి అధునాతన టాయ్ లెట్.

ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు సైతం ఈ ప్యాలెస్ సందర్శించి, కోట్ల రూపాయల నిధులను గత ప్రభుత్వం స్వార్థపూరితంగా వ్యవహరించి వృధా చేసినట్లు విమర్శించారు. అయితే తాజాగా ఈ ప్యాలెస్ లోని టాయిలెట్‌ గురించి అసెంబ్లీ మార్మోగింది.


అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మేల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఏదిఏమైనా మాజీ సీఎం హుందాతనానికి రుషికొండ ప్యాలెస్ నిదర్శనమన్నారు. అందులో కూడా ప్యాలెస్ లోని టాయిలెట్‌ మాత్రం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందని అనగానే, సభ్యులంతా చిరునవ్వులు చిందించారు. ఈ టాయిలెట్‌ అక్షరాలా రూ. 11,46,840 ధర పలికినట్లు తనకు తెలిసిందని, అలాగే వాష్ బేసిన్ ధర రూ. 2,61,500 లు గా తెలిపారు.

Also Read: Lady Aghori at Dilsukhnagar: త్వరలోనే ‘అది’ కోస్తానంటున్న అఘోరీ.. అందరి ముందే అలా చేస్తానంటూ..

సభలో ఎందరో కోటీశ్వరులు ఉన్నారని, కానీ ఇంతటి సదుపాయం గల టాయిలెట్‌ వాడుతున్నారో లేదో తనకు తెలియదన్నారు. రుషికొండ టాయిలెట్ గురించి ప్రత్యేకతలు తెలుసుకొని తాను షాక్ కు గురయ్యానని, వెళ్లి అలా కూర్చుంటే చాలు.. అలా వాష్ చేసే సౌలభ్యం ఆటోమేటిక్ గా ఉందన్నారు. చేతులు కూడా అవసరం లేకుండా.. మంచి సౌలభ్యం ఉన్న టాయిలెట్‌ అంటూ విష్ణు రాజు అనగానే స్పీకర్ తో సహా అసెంబ్లీ లో నవ్వులు విరబూశాయి. ఇలా మరోమారు రుషికొండ ప్యాలెస్ వార్తల్లో నిలిచింది.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×