రెడ్ బుక్, రెడ్ బుక్ అనుకుంటూ.. జగన్ పూర్తిగా ఆ మాయలో పడిపోయి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నట్టుంది. తాజాగా ఆయన తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న యువకుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు, వారిని ఓదార్చారు. తెనాలిలో జాన్ విక్టర్ కుటుంబాన్ని కలసి, పరామర్శించిన అనంతరం మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసులతో కావాలనే ఆ యువకులను కొట్టించారని, ప్రభుత్వం తప్పు చేసిందంటూ ధ్వజమెత్తారు.
వాళ్ళు గంజాయి కొడితే నాకేంటి ?
వాళ్ళు రేప్ చేస్తే నాకేంటి ?
వాళ్ళు మర్డర్లు చేస్తే నాకేంటి ?
వాళ్ళు దొంగతనాలు చేస్తే నాకేంటి ?ఆ కేసులు ఉంటే, మా గంజాయి బ్యాచ్ ని కొడతారా ?
ఇదేమి లాజిక్ పిచ్చోడా… pic.twitter.com/jvrg1MfZfp
— I Love India✌ (@Iloveindia_007) June 3, 2025
ఆ ముగ్గురు ఎవరు..?
తెనాలిలో ఇటీవల పోలీసులు బహిరంగంగా ముగ్గురు యువకులను లాఠీలతో చితకబాదిన విషయం తెలిసిందే. ఈ ఘటన బయటకొచ్చాక భిన్నరకాల ప్రతిస్పందనలు వచ్చాయి. ఆ యువకులు ఎలాంటి తప్పయినా చేయొచ్చు, కానీ పోలీసులకు వారిని బహిరంగంగా కొట్టే హక్కు లేదని కొంతమంది సామాజి ఉద్యమ నాయకులు వాదించారు. మరికొందరు వారు చేసిన తప్పుకి అలా బహిరంగంగా కొట్టడమే సరైన పని అని సమర్థించారు. ఇంకొందరు ఇక్కడ సామాజిక కోణం వెదికారు. వారిలో దళితులు ఉన్నారని. వారిని కొట్టడం సామాజిక న్యాయమేనా అన్నారు. సహజంగానా వేసీపీ ఈ ఘటనలో రెడ్ బుక్ ని తీసుకొచ్చంది. ఇక్కడ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారిలో ఎవరూ బుద్ధిమంతులు లేరు. పక్కా పోకిరీలు. వారిపై పాత కేసులు చాలానే ఉన్నాయి. అవి కూడా వైసీపీ హయాంలో నమోదయ్యాయి. ఆ కేసులకు ఈ ఘటనకు సంబంధమే లేదు. కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారనే కారణంతో ఆ ముగ్గురిని పోలీసులు చితక్కొట్టారు. ఆ తర్వాత రిమాండ్ కి పంపించారు. ఇక్కడ జగన్ ఓ లాజిక్ తీస్తున్నారు. తప్పు చేసినా సరే వారిని శిక్షించే అధికారం పోలీసులకు లేదంటున్నారు. పాత కేసులు ఉన్నంత మాత్రాన వారిని మరోసారి తప్పుడు కేసుల్లో ఇరికిస్తారా అంటున్నారు. తాజాగా తెనాలిలో జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.
జగన్ పరామర్శ వ్యవహారం వైసీపీని సమర్థించే వారికి కూడా నచ్చడం లేదంటే అతిశయోక్తి కాదు. తటస్థులు ఈ విషయంలో జగన్ కి చురకలంటిస్తున్నారు. నేరస్తులకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్న జగన్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ మండిపడ్డారు. అంటే ఈ ఘటనతో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు స్పష్టమవుతోంది.
నేరస్తులకు తోడుగా జగనన్న ❤️
తెనాలిలో ఇటివల పోలీసు కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడిన జాన్ విక్టర్ ని రేపు జగనన్న తెనాలిలో పరామర్శించనున్నారు.
ఈ జాన్ విక్టర్, రాకేశ్ మీద ఇది వరకే రౌడీషీట్, దారి దోపిడీ కేసులు ఉన్నాయి కాగా వైసీపీ హయాంలోనే వీరిపై గంజాయి కేసులు నమోదు కావడం గమనార్హం. pic.twitter.com/yxMIyxhrr2
— Megha Shyam Reddy 🦅🚩 (@MSRv96) June 2, 2025
సాక్షాత్తూ హోం మంత్రి అనిత కూడా ఈ విషయంపై స్పందించారు. శాంతి భద్రతలకు సంబంధించిన అంశాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని అన్నారు. దళితులకు అన్యాయం జరిగిందని అందుకే పరామర్శించడానికి వస్తున్నానని చెప్పుకుంటున్న జగన్, తన హయాంలో దళితులను తప్పుడు కేసుల్లో ఇరికించి ఎందుకు హింసించాలని నిలదీస్తున్నారు. అప్పుడెందుకు జగన్ పరామర్శలకు రాలేదని ప్రశ్నిస్తున్నారు.
డాక్టర్ సుధాకర్, వరప్రసాద్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, పులివెందులలో నాగమ్మ ఇంటికి ఆ రోజు జగన్ ఎందుకు వెళ్ళలేదు ?
ఈ రోజు హత్యలు చేసిన గంజాయి బ్యాచ్ ఇంటికి వెళ్తున్నాడు అంటే, అతని మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది. #PsychoFekuJagan #AndhraPradesh pic.twitter.com/1CYgDaoSyf— Telugu Desam Party (@JaiTDP) June 2, 2025
గంజాయి మామ..
జగన్ పరామర్శ ఘటనకు సంబంధించి ఆ ముగ్గురు పాత నేరస్తులపై గంజాయి కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో టీడీపీ గంజాయి మామ అంటూ జగన్ పై ఓ ఎపిసోడే నడుపుతోంది. గంజాయి మామను స్థానికులు అడ్డుకున్నారంటూ వీడియోలు పోస్ట్ చేస్తోంది టీడీపీ.
మానవ మృగాలుగా ఉన్న గంజాయి బ్యాచ్ ని ఓదార్చటానికి తెనాలి వస్తున్న జగన్ గారికి సిగ్గుందా ? జగన్ పర్యటనకు వ్యతిరేకంగా తెనాలి మార్కెట్ సెంటర్లో దళిత, ప్రజా సంఘాల రాస్తారోకో. నూతక్కి కిరణ్ హత్యపై జగన్ పరామర్శించకపోవడంపై దళితులు ఆగ్రహం. #GanjaMama#గంజాయిమామ#NoCasteForCriminals… pic.twitter.com/hPNA0gfAIC
— Telugu Desam Party (@JaiTDP) June 3, 2025
మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ తో వైసీపీకి ఏమైనా లాభం ఉంటుందేమో తెలియదు కానీ, వ్యక్తిగతంగా జగన్ ని అభిమానించే కొంతమంది కూడా ఆయన వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు. గంజాయి బ్యాచ్ కి జగన్ మద్దతేంటని లాజిక్ తీస్తున్నారు. నేరస్తులను కూడా సామాజిక వర్గాల వారీగా చూడాల్సిన దౌర్భాగ్యం జగన్ కి పట్టడమేంటని మండిపడుతున్నారు.