E-Paper
Advertisement

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది
Advertisement

Anantapur News: ఏపీలో ఊహించని ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు ఆపలేదని డ్రైవర్‌పై చేయి చేసుకుంది ఓ మహిళ. ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారి తీసింది.  ఈ ఘటనపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లో వెళ్తే..

సోమవారం అనంతపురం నుంచి కల్యాణదుర్గం వైపు పల్లె వెలుగు బస్సు వెళ్తోంది. నడిమివంక ప్రాంతానికి సమీపంలోకి రాగానే డ్రైవర్ నటేష్‌బాబు ఆపకుండా వెళ్లిపోయాడు. ఆ బస్సు కోసం ఓ ప్రైవేటు ఉద్యోగి వెయిట్ చేస్తోంది. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ.. బైక్ సాయంతో చివరకు బస్సును ఓవర్ టేక్ చేసింది.

Advertisement

బస్సుని ఆ స్టాపు దగ్గర ఎందుకు ఆపలేదని డ్రైవర్‌ని నిలదీసింది. ఆ తర్వాత డ్రైవర్‌పై శివాలెత్తింది ఆమె. దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు రెచ్చిపోయిన ఆ మహిళ డ్రైవర్ చెంప చెళ్లుమనిపించింది. ఈ సన్నివేశంతో బస్సులో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాకయ్యారు.

తనపై దాడి చేసిన మహిళ బస్సు దిగే వరకు వెళ్లేది లేదని డ్రైవర్ మొండి కేశాడు. చివరకు బస్సులోని కన్వీన్స్ చేయడంతో ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్రైవర్. ఈ ఘటన విషయం తెలియగానే ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న ఉద్యోగిని కొట్టడం ఏంటని అంటున్నారు.

Advertisement

ALSO READ: రోజా అసలు ఆట మొదలు, అరెస్టుకు రంగం సిద్ధం

ఉచిత బస్సు పథకం రాకముందే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆ పథకం అమల్లోకి వస్తే ఇంకెన్ని ఘటనలు జరుగుతాయోనని అంటున్నారు. ఉచిత బస్సు పథకం ఆగష్టు 15 నుంచి ఏపీ వ్యాప్తంగా మొదలుకానుంది.

ఈ స్కీమ్ విషయంలో పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ ఛైర్మన్, ఎండీలు కలిసి వివిధ జిల్లాల్లో పర్యటించారు. అక్కడి ఉద్యోగులకు చెప్పాల్సిన విషయాలు చెప్పారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో ఉద్యోగులు షాకయ్యారు.

 

 

Related News

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

Big Stories

Advertisement
×