E-Paper
Advertisement

YCP 5th List : వైసీపీ 5వ లిస్ట్ విడుదల.. సిట్టింగులకు మళ్లీ మొండిచేయి..

YCP 5th List : వైసీపీ 5వ లిస్ట్ విడుదల.. సిట్టింగులకు మళ్లీ మొండిచేయి..
Advertisement
AP Political news

YCP MLA Candidates list 5th list(AP political news):

వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఐదో జాబితాను విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతో ఐదో జాబితాను మంత్రి బొత్స ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్​ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా చలమలశెట్టి సునీల్‌ పేరును ఖరారు చేశారు. తిరుపతి పార్లమెంట్​ నియోజకవర్గ ​ఇంఛార్జ్‌గా మద్దెల గురుమూర్తి పేరును ప్రకటించారు. మచిలీపట్నం పార్లమెంట్​ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా సింహాద్రి రమేష్‌ బాబుకు అవకాశం కల్పించారు. ఇక నరసరావుపేట పార్లమెంట్​ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్ పేరును ప్రకటించారు.

ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే.. అరకు అసెంబ్లీ స్థానానికి ఇంఛార్జ్‌గా ​ రేగం మత్స్యలింగం, సత్యవేడు అసెంబ్లీ నియోజకర్గ ఇంఛార్జ్‌గా నూకతోటి రాజేష్‌, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించారు. ఈ ఐదో జాబితాలో వైసీపీ అధిష్టానం ముగ్గురు కొత్తవారికి చోటు కల్పించింది.

Advertisement

వైసీపీలో ప్రతీ జాబితాలోనూ కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. అధిష్టానం సిట్టింగ్‌లకి మొండిచేయి చూపిస్తుంది. దీంతో.. కొత్త జాబితా విడుదలైన ప్రతీసారి అసంతృప్తుల జాబితా పెరుగుతుంది. ఎక్కడికక్కడ అసమ్మతి నేతలు అధిష్టానంపై పెదవి విరుస్తున్నారు. పైగా నామినేషన్ చివిరి రోజు వరకు మార్పులు చేర్పులు ఉంటాయని బొత్స నిన్న చెప్పారు. దీంతో.. వైసీపీ నేతలు ఆయోమయంలో పడుతున్నారు.

.

Advertisement

.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×