E-Paper
Advertisement

YCP Party on TDP Govt: చంద్రబాబు సర్కార్ గురించి గూగుల్ ఇలా చూపిస్తోందా?

YCP Party on TDP Govt: చంద్రబాబు సర్కార్ గురించి గూగుల్ ఇలా చూపిస్తోందా?
Advertisement

YCP Party on TDP Govt: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన సైకో సోషల్ మూక.. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అదేపంథా కొనసాగిస్తోంది. జగన్ అండ చూసుకుని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనా పార్టీ నాయకులు, మహిళలపై, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం , ఇతర ముఖ్య నేతలపై ట్రోల్స్ చేయడం ఆగడం లేదు.

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పాలన గురించి గూగుల్ ఏం చూపిస్తుందో చూడండని.. వైసీపీ అనుబంధ సోషల్ మీడియా ఖాతాలో ఆశ్చర్యకర పోస్ట్ చేశారు. ఇందులో గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి “1 lakh crore debt” అని టైప్ చేస్తే.. ఆంధ్రప్రదేశ్ రూ.1.12 లక్షల కోట్లను ఆరు నెలల్లో తీసుకుందని చెప్తోంది. కానీ వాస్తవానికి గూగుల్‌లో అలా చూపించకపోవడం గమనర్హం. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Advertisement

కాగా ఇటీవల సోషల్ మీడియాలో పైశాచిక పోస్టులు పెడుతున్న సైకోలకు చుక్కలు చూపించడం మొదలు పెట్టింది. సోషల్ మీడియోలో చెలరేగిపోతున్న ముసుగు ముఖాలపై.. ఏపీ ప్రభుత్వం ఉక్కపాదం మోపేందుకు సిద్ధమైంది. రాజకీయ నాయకులను మానసికంగా కృంగదీసేందుకు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఖాతాలను మూసేసి మాయమైన వారి పాత పోస్టుల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. నిందుతులపై కఠినమైన కేసులు పెట్టడంతో పాటు వారి అసలు ముఖాలను బహిర్గతం చేయాలనే పనిలో పడింది చంద్రబాబు సర్కార్.

Also Read: సజ్జలకు పవన్ కళ్యాణ్ షాక్.. 150 ఎకరాల భూముల రీ-సర్వే

Advertisement

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పాల్పడుతున్న వారిని గుర్తించి అసలు పేర్లు, వివరాలు, వారిపై నమోదైన కేసుల జాబితాను బహిరంగంగా ఉంచాలని యోచిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహిళా మంత్రులు, పలువురు నాయకులపై అసభ్యంగా దూషిస్తున్న పలువురిని సైబర్ బృందాలు గుర్తించాయి. వారందరి అసలుపేర్లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు సన్నాహాలు చేస్తుంది. మరి చంద్రబాబు పాలన గురించి గూగుల్ ఏం చూపిస్తుందో చూడండని.. వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందిస్తారో లేదో చూడాల్సిందే..

ఇదిలా ఉంటే.. సజ్జల భార్గవ్‌, వైసీపీ నేతల పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటారని, అందులో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడింది ధర్మాసనం. అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు.. సోషల్ మీడియా సాధనంగా మారుతోందన్నారు. అనుచిత పోస్టుల కట్టడికి తీసుకున్న చర్యలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం… తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×