E-Paper
Advertisement

YCP Rebel MLAs: స్పీకర్ విచారణకు ఇప్పుడే రాలేం.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు డుమ్మా..

YCP Rebel MLAs: స్పీకర్ విచారణకు ఇప్పుడే రాలేం.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు డుమ్మా..
Advertisement

YCP Rebel MLAs News: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు తన వద్ద విచారణకు గురువారం రావాలి కోరారు. కానీ తాము రాలేమని ఆ నలుగురు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు.

తమకు వ్యతిరేకంగా ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని ఆ నలుగురు ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు. ప్రసాదరాజు సమర్పించిన వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని ఆయా సంస్థలు నుంచి.. సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాశారు.

Advertisement

వాస్తవానికి గురువాం మధ్యాహ్నం 3 గంటలకు మేకపాటి, కోటంరెడ్డి, ఆనం, శ్రీదేవి మౌఖికంగా తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇక టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయానికే వదిలేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు.

స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు. గురువారం తన ఎదుట విచారణకు హాజరు కావాలని టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.

Advertisement

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలు మద్ధాలి గిరిధరను స్పీకర్ విచారణకు హాజరుకావాలని కోరారు. ఈ నలుగు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు.

అటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు స్పీకర్ వద్ద ఉన్నాయి. మరి సభాపతి తమ్మినేని సీతారాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×