E-Paper
Advertisement

YS Jagan: లోక్‌భవన్‌కు వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశం, ఎందుకంటే..?

YS Jagan: లోక్‌భవన్‌కు వైఎస్ జగన్.. గవర్నర్‌తో సమావేశం, ఎందుకంటే..?
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని లోక్ భవన్ పరిసరాల్లో భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు సమర్పించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో.. రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు విజయవాడకు తరలివచ్చారు. కార్యకర్తల తాకిడి పెరగడంతో పోలీసులు లోక్ భవన్ పరిసరాల్లో ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బారికేడ్లు నిర్మించి, అదనపు బలగాలను రంగంలోకి దించారు. లోక్ భవన్ వైపు వచ్చే రహదారులన్నీ జనసంద్రంగా మారాయి.

Advertisement

వైసీపీ శ్రేణుల నిరసనల మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని.. సామాన్యులకు వైద్య సేవలు భారం అవుతాయని ఆయన గవర్నర్‌కు వివరించారు. ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఈ సందర్భంగా గవర్నర్‌కు అందజేసి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని వైసీపీ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలను నియంత్రించడం పోలీసులకు సవాలుగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోక్ భవన్ ప్రాంతంలో ఆంక్షలు కఠినతరం చేశారు.

Advertisement

ALSO READ: Ibomma Ravi: తీగ లాగితే డొంక కదిలింది, ఐ బొమ్మ రవి కేసులో దిమ్మతిరిగే నిజాలు

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×