E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రిన్ని సంచ‌ల‌నాలు.. ఆ ఇద్ద‌రి నంబ‌ర్లు ట్యాప్!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రిన్ని సంచ‌ల‌నాలు.. ఆ ఇద్ద‌రి నంబ‌ర్లు ట్యాప్!
Advertisement

Phone Taping:  బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్య‌వ‌హ‌రం రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పోలీసులకే ప‌రిమితం అయిన ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల‌కు సైతం నోటీసులు అందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యంలో లింగ‌య్య రెండు ఫోన్ నంబ‌ర్ల‌ను ట్యాప్ చేయించిన‌ట్టు అధికారులు గుర్తించారు.

Also read: సుల్తానాబాద్ జిల్లాలో చేత‌బ‌డి క‌ల‌క‌లం.. పంట‌పొలంలో మ‌నిషిబొమ్మ‌.. వెళ్లి చూడ‌గానే!

Advertisement

ఆ రెండు నంబ‌ర్ల‌ను అడిష‌న‌ల్ ఎస్పీ భుజంగ‌రావు, తిరుప‌త‌న్న ట్యాప్ చేసిన‌ట్టు తెలుస్తోంది. వీరు ప్ర‌స్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంద అనుచ‌రులు మ‌ద‌న్ రెడ్డి, రాజ్ కుమార్ ల ఫోన్ నంబ‌ర్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు నిర్దారించారు. మ‌ద‌న్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు ఎయిర్ టెల్ నుండి రిపోర్టు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎమ్మెల్యే లింగ‌య్య‌తో పాటూ వీరిద్ద‌రినీ నేడు విచార‌ణ‌కు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు చిరుమర్తి లింగయ్య వెళ్ల‌నున్నారు.

ఆయ‌న‌ను ఏసీపీ వెంకటగిరి విచారించ‌నున్నారు. విచార‌ణ త‌రవాత ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. అంతే కాకుండా ఈ కేసులో ఇంకా ఎవ‌రెవ‌రి పేర్లు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్న చ‌ర్చ మొద‌లైంది. అయితే ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ కుట్ర చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఏ ప్ర‌భుత్వ‌మైనా చేస్తుంద‌ని సాధార‌ణ విష‌య‌మ‌ని చెప్ప‌డం తెలిసిందే.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×