E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రిన్ని సంచ‌ల‌నాలు.. ఆ ఇద్ద‌రి నంబ‌ర్లు ట్యాప్!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రిన్ని సంచ‌ల‌నాలు.. ఆ ఇద్ద‌రి నంబ‌ర్లు ట్యాప్!

Phone Taping:  బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్య‌వ‌హ‌రం రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పోలీసులకే ప‌రిమితం అయిన ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల‌కు సైతం నోటీసులు అందుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యంలో లింగ‌య్య రెండు ఫోన్ నంబ‌ర్ల‌ను ట్యాప్ చేయించిన‌ట్టు అధికారులు గుర్తించారు.

Also read: సుల్తానాబాద్ జిల్లాలో చేత‌బ‌డి క‌ల‌క‌లం.. పంట‌పొలంలో మ‌నిషిబొమ్మ‌.. వెళ్లి చూడ‌గానే!

ఆ రెండు నంబ‌ర్ల‌ను అడిష‌న‌ల్ ఎస్పీ భుజంగ‌రావు, తిరుప‌త‌న్న ట్యాప్ చేసిన‌ట్టు తెలుస్తోంది. వీరు ప్ర‌స్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంద అనుచ‌రులు మ‌ద‌న్ రెడ్డి, రాజ్ కుమార్ ల ఫోన్ నంబ‌ర్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు నిర్దారించారు. మ‌ద‌న్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్టు ఎయిర్ టెల్ నుండి రిపోర్టు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎమ్మెల్యే లింగ‌య్య‌తో పాటూ వీరిద్ద‌రినీ నేడు విచార‌ణ‌కు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు చిరుమర్తి లింగయ్య వెళ్ల‌నున్నారు.

ఆయ‌న‌ను ఏసీపీ వెంకటగిరి విచారించ‌నున్నారు. విచార‌ణ త‌రవాత ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. అంతే కాకుండా ఈ కేసులో ఇంకా ఎవ‌రెవ‌రి పేర్లు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్న చ‌ర్చ మొద‌లైంది. అయితే ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ కుట్ర చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఏ ప్ర‌భుత్వ‌మైనా చేస్తుంద‌ని సాధార‌ణ విష‌య‌మ‌ని చెప్ప‌డం తెలిసిందే.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×