BigTV English
Advertisement

Sharmila vs Jagan: దమ్ముంటే అసెంబ్లీ రండి.. లేకుంటే రాజీనామా చేయ్యండి, జగన్‌కు షర్మిల సలహా

Sharmila vs Jagan: దమ్ముంటే అసెంబ్లీ రండి.. లేకుంటే రాజీనామా చేయ్యండి, జగన్‌కు షర్మిల సలహా

Sharmila vs Jagan: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. బడ్జెట్ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండటాన్ని వివిధ రాజకీయ పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చక్కటి సలహా ఇచ్చారు. దమ్ముంటే నేతలు అసెంబ్లీకి వెళ్లాలని, లేకుంటే శాసనసభా పక్షం మొత్తం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది ఏపీలో మాజీ సీఎం జగన్ పరిస్థితి అంటూ వైసీపీపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల గొంతుక వినిపించే అవకాశం వైసీపీకి ప్రజలిస్తే ప్రతిపక్షం ఇస్తేనే వస్తామనం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళాలని సూచన చేశారు. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలన్నారు. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయాలన్నారు. అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోవాలని సలహా ఇచ్చేశారు.


అసెంబ్లీ మీద అలగడానికి.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికోకాదు ప్రజలు మీరు ఓట్లేసిందని ప్రశ్నించారు షర్మిల. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదని, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందని ఎక్స్‌లో ప్రస్తావించారు. మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాననడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

ALSO READ: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా

అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమన్నారు ఏపీ పీసీసీ. 1994లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లకే పరిమితం అయ్యిందన్నారు. అయినా ఏ మాత్రం కుంగిపోలేదని, మీకు మాదిరిగా హోదా కావాలని మారం చేయలేదంటూ లోపాలను ఎత్తి చూపారు.

26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డామని, ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించిందన్నారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైనా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని ఏనాడూ అడగలేదని గుర్తు చేశారు.

హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి అగ్రనేతలు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని గుర్తు చేశారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారన్నారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని వివరించారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, మహిళలపై దాడులు కొనసాగుతున్నానని అన్నారు. ఓ వైపు ఇసుక మాఫియా, ఇంకోవైపు బెల్టు షాపుల దందాను అరికట్టలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదన్నారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.

 

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×