E-Paper
Advertisement

YS Sharmila : బీజేపీతో కంటికి కనిపించని పొత్తు.. వైసీపీపై షర్మిల విమర్శనాస్త్రాలు..

YS Sharmila : బీజేపీతో కంటికి కనిపించని పొత్తు.. వైసీపీపై షర్మిల విమర్శనాస్త్రాలు..
Advertisement
AP Political news

YS Sharmila latest news today(AP political news) :

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల(YS Sharmila) దూకుడుగా ముందుకెళుతున్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న ఆమె.. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తన అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy)ని సూటిగా ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు.

తాజాగా విశాఖపట్నంలో కాంగ్రెస్ కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. పాలక పక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్‌ అయ్యాయన్నారు. కాషాయ పార్టీతో వైసీపీకి కంటికి కనిపించని పొత్తు ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నసమయంలో ప్రత్యేక హోదాపై జగన్ గట్టిగా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై పోరాటమే చేయలేదన్నారు. గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. స్వలాభాల కోసం ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.

Advertisement

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×