BigTV English
Advertisement

Sajjala re entry: సభ బీసీలది.. కానీ డామినేషన్ సజ్జలది..!

Sajjala re entry: సభ బీసీలది.. కానీ డామినేషన్ సజ్జలది..!

సజ్జల ఈజ్ బ్యాక్.. అవును కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సజ్జల ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. ఆయన కమ్ బ్యాక్ కోసం వైసీపీ ఏకంగా ఓ సభ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సభ బీసీలది. మరి బీసీ సభలో ఓసీ నాయకుడు సజ్జల ఎందుకు అనే అనుమానం అందరికీ రావడం కామన్. సభ బీసీలది అయినా వైసీపీలో బీసీల తరపున మాట్లాడే నాయకులెవరూ లేరని కాబోలు సజ్జలని తెరపైకి తెచ్చారు. ఆయనతోనే ఉపన్యాసం ఇప్పించారు. వైసీపీ బీసీల పార్టీ అని చెబుతూ.. బీసీలకు పెద్దగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా సజ్జలే లీడ్ తీసుకోవడం ఇక్కడ విశేషం. దీంతో టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలు పెట్టారు. వైసీపీలో బీసీ నేతల పరిస్థితి ఏంటో ఈ సభతోనే అర్థమైపోయిందని అంటున్నారు టీడీపీ నేతలు.


సజ్జల సడన్ ఎంట్రీ..
ఇటీవల కొంతకాలంగా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో కనపడ్డంలేదు. సహజంగా జగన్ ఎక్కడుంటే ఆయన కూడా అక్కడ ఉండాలి. కానీ ఆయన లేకుండానే జగన్ నాలుగైదు సార్లు జనంలోకి వచ్చారు. పార్టీ ఆఫీస్ లో కూడా మీటింగ్ లు జరిగాయి. సజ్జల లేకపోవడంతో చాలామందికి చాలా అనుమానాలొచ్చాయి కానీ, ఆయన ఇప్పుడు సడన్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ నాయకత్వం కూడా సజ్జలకే జగన్ అప్పగించడం మరో విశేషం. దీంతో జగన్ వద్ద ఆయన ప్రయారిటీ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది.

సజ్జలపై గరం గరం..
అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రి అనే అపవాదు మోశారు సజ్జల. పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామందికి ఆయన టార్గెట్ అయ్యారు. కొందరు బయటపడి మాట్లాడేశారు, మరికొందరు సైలెంట్ గా ఉన్నారు. ఇంకొందరు ఏకంగా పార్టీ నుంచి బయటకొచ్చేసి కోటరీ అంటూ కేకలు వేశారు, కానీ ఫలితం లేదు. జగన్ మాత్రం సజ్జలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో ఆయనకు పెద్దపీట వేశారు. ఇక తాజాగా బీసీ మీటింగ్ కూడా సజ్జల నేతృత్వంలోనే జరిగింది.

వైసీపీ బీసీ సెల్ మీటింగ్ కి మాజీ మంత్రులు జోగి రమేష్, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ సహా అన్ని జిల్లాలనుంచి బీసీ నేతలు హాజరయ్యారు. అయితే కీలక ఉపన్యాయం మాత్రం సజ్జలదే. బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అనే విషయాన్ని జగన్ నిరూపించారని అన్నారు సజ్జల. వైసీపీ నేతలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలని, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని సూచించారు. గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్థాయి కమిటీలను ఈసారి నియమించుకుందామని అన్నారాయన. విశాఖలో బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి తప్పించారని విమర్శించారు.

అంతా బాగానే ఉంది కానీ సజ్జల రీఎంట్రీ కోసం బీసీ మీటింగ్ ని ఎంచుకోవడం హాస్యాస్పదం అంటున్నారు టీడీపీ నేతలు. బీసీ పార్టీ అంటే టీడీపీయేనని, బీసీలకు అవకాశాలిచ్చి, నేతలుగా ఎదిగే తోడ్పాటునిచ్చింది, ఇస్తోంది కూడా టీడీపీయేనని చెప్పారు. బీసీల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని వారు కౌంటర్లిచ్చారు.

Tags

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×