Kethireddy Warns: వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి తీసుకునేదే లేదని తెగేసి చెప్పారు. బంధుప్రీతితో మళ్లీ పార్టీలోకి తీసుకొస్తామని కార్యకర్తలు అంటే బాగోదని హెచ్చరించారు. అలాంటి వారిని పార్టీ గేటు బయటే ఆపి చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ధర్మవరంలో వైసీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడారు. శత్రువునైనా పార్టీలోకి చేర్చుకుంటాము కానీ, వెన్నుపోటు దారులను మాత్రం క్షమించేది లేదన్నారు. పార్టీ అధికారంలో ఉండగా లబ్ది పొంది.. ఓడిపోగానే గేటు దూకేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వనని పేర్కొన్నారు. బంధుత్వం, స్నేహాన్ని అడ్డుపెట్టుకొని తిరిగి రావాలని ప్రయత్నం చేసినా కనికరించేది లేదన్నారు.
కష్టకాలంలో తనకూ, పార్టీకి అండగా నిలుస్తున్న ధర్మవరం వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని కేతిరెడ్డి హామీ ఇచ్చారు. జగన్ మరోమారు సీఎం కాగానే.. కార్యకర్తలకే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
Also Read: Pak Fake Judge: ఓరి మీ దుంపతెగ.. హైకోర్టును వదల్లేదు కదరా.. పాక్లో విచిత్ర ఘటన!
మరోవైపు తిరుమల కల్తీ నెయ్యి అంశంపైనా కేతిరెడ్డి మాట్లాడారు. సీబీఐ సిట్ ఏమి జరగలేదని రిపోర్టు ఇచ్చినా.. ఏదో ఉందంటూ చిల్లర రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం ఏడు కొండల వివాదంలోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు కొండలను రెండు కొండలు చేశారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని హిందు వ్యతిరేక పార్టీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Maoist Leader Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి మిస్సింగ్.. భారత్లో ఉన్నారా? నేపాల్ పారిపోయారా?