BigTV English

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

వైసీపీ నేతలు కూటమి నెత్తిన పాలు పోస్తున్నారు, అవును ఇది నిజం. సూపర్ సిక్స్ హామీల అమలుని కూటమి నేతలు ప్రజల్లోకి సరిగా తీసుకెళ్తున్నారో లేదో తెలియదు కానీ, వైసీపీ నేతలు మాత్రం ప్లకార్డులు పట్టుకుని మరీ ప్రచారానికి వెళ్తున్నారు. సూపర్ సిక్స్ లో ఏ పథకం అమలైంది, ఏది అమలు కాబోతోంది, ఏ పథకం కింద ఎంత లబ్ధి జరిగిందనే విషయం ప్రజలకు క్లియర్ గా తెలిసిపోయింది. వైసీపీ నేతలు ఇంటికొచ్చినప్పుడు కూడా వారు అదే చెబుతున్నారు. దీంతో విమర్శించాలని వెళ్లిన వైసీపీ నేతలు, సైలెంట్ గా తిరిగొచ్చేస్తున్నారు.


వైసీపీకి తిరస్కారం..
చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అంటూ ఇటీవల వైసీపీ ఓ విమర్శనాత్మక కార్యక్రమం చేపట్టింది. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ అందులో ఏవి అమలయ్యాయి, ఏవి కాలేదు అని గుర్తు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అయితే సూపర్ సిక్స్ హామీలు దాదాపుగా అమలులోకి వచ్చేశాయి, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకాన్ని కూడా త్వరలో తెరపైకి తెస్తున్నారు. దీంతో వైసీపీకి ఎలా విమర్శించాలో అర్థం కావడం లేదు. వైసీపీ అనుకూల కుటుంబాల వద్దకు వెళ్తే ఓకే, తటస్తులు, సామాన్య ప్రజల వద్దకు వెళ్తే వైసీపీకి నిరసన సెగలు తప్పడంలేదు. తమకు అన్ని పథకాలు వస్తున్నాయని, మిగతా వాటి అమలుపై తమకు క్లారిటీ ఉందని జనం మొహం మీదే చెప్పేస్తున్నారు. దీంతో కీలక నేతలెవరూ ఇలాంటి కార్యక్రమాలతో జనం వద్దకు వెళ్లడం మానేశారు. వారి తరపున చోటా మోటా నేతలు మాత్రనం జనంలోకి వెళ్లడం విశేషం.

తల్లికి వందనం సక్సెస్..
ఏడాది పాలన తర్వాత అటు టీడీపీ, ఇటు వైసీపీ పోటా పోటీగా కార్యక్రమాలు చేపట్టాయి. ఏడాది పాలన బాగుందని కూటమి పార్టీలు జనంలోకి వెళ్లాయి, ఏడాది పాలనలో అన్నీ అరాచకాలేనంటూ వైసీపీ ప్రజల వద్దకు వెళ్తోంది. అయితే వైసీపీకి జనం నుంచి పెద్దగా మద్దతు లేదు. పైగా అప్పటికే పథకాలు అమలులోకి వచ్చాయి. అందులోనూ తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ పథకం వర్తించడం ఇక్కడ విశేషం. దీంతో చాలా కుటుంబాలు భారీగా లబ్ధిపొందాయి. అలా లబ్ధిపొందినవారెవరైనా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? వైసీపీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయాలన్నా వారు ఒప్పుకుంటారా? ఇప్పుడు జరుగుతోంది ఇదే. వైసీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టాలని చూస్తుంటే.. ప్రజలే అడ్డుకుంటున్నారు. తమకు అన్ని పథకాలు వచ్చాయంటున్నారు.

ఏడాదిలోనే మార్పు..
నవరత్నాలు అంటూ జగన్ చెప్పినా అందులో కొన్ని రత్నాలు అసలు అమలే కాలేదు, కొన్నిటిని అమలు చేయడానికి రెండేళ్లకు పైగా టైమ్ తీసుకున్నారు. మరిప్పుడు సూపర్ సిక్స్ అమలు విషయంలో జగన్ ఎందుకంత ఓపికతో లేరని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే దాదాపుగా పథకాలన్నీ పట్టాలెక్కాయి, మిగతావాటిపై క్లారిటీ వచ్చేసింది. ఈ దశలో హామీలు అమలు కాలేదంటూ వైసీపీ నేతలు జనంలోకి వెళ్తే ఇలాంటి రిజల్టే ఉంటుందని విమర్శిస్తున్నారు. ఒకరకంగా ఈ ప్రచారంలో కూటమికి మేలే జరుగుతోందని, పథకాలన్నీ అమలయ్యాయనే విషయాన్ని ప్రజలకు మరోసారి వారు గుర్తు చేస్తున్నారని అంటున్నారు.

Related News

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

CM Chandrababu: మీ ఇంటికి వచ్చి ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Bonda Vs Pawan: బొండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

Big Stories

×