E-Paper
Advertisement

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర 218వ రోజుకు చేరింది. ఆదివారం తుని అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. తుని నియోజకవర్గంలో చేసిన పర్యటనతో.. యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తవ్వడంతో గుంటూరులో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులోని శిల్పారామం నుంచి అమరావతి రోడ్డు వరకూ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. యువగళానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో ముందుకెళ్తూ.. యాత్రను కొనసాగిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ ప్రభంజనం ఖాయమన్నారు.

ఆదివారం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవ్వగా.. లోకేష్ ఒంటిమామిడి జంక్షన్లో మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తొండంగి హనుమాన్ జంక్షన్ లో రైతులతో సమావేశమయ్యారు. శృంగవృక్షంలో ఎస్సీ సామాజిక వర్గీయులను కలిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. మధ్యాహ్నం కాకినాడ సెజ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×