BigTV English

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర 218వ రోజుకు చేరింది. ఆదివారం తుని అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. తుని నియోజకవర్గంలో చేసిన పర్యటనతో.. యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తవ్వడంతో గుంటూరులో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులోని శిల్పారామం నుంచి అమరావతి రోడ్డు వరకూ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.


ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. యువగళానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో ముందుకెళ్తూ.. యాత్రను కొనసాగిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ ప్రభంజనం ఖాయమన్నారు.

ఆదివారం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవ్వగా.. లోకేష్ ఒంటిమామిడి జంక్షన్లో మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తొండంగి హనుమాన్ జంక్షన్ లో రైతులతో సమావేశమయ్యారు. శృంగవృక్షంలో ఎస్సీ సామాజిక వర్గీయులను కలిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. మధ్యాహ్నం కాకినాడ సెజ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.


Related News

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Big Stories

×