BigTV English
Advertisement

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: యువగళం @3000 కిలోమీటర్లు.. గుంటూరులో 3వేల ఆటోలతో భారీ ర్యాలీ

Yuvagalam: టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర 218వ రోజుకు చేరింది. ఆదివారం తుని అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. తుని నియోజకవర్గంలో చేసిన పర్యటనతో.. యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తవ్వడంతో గుంటూరులో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులోని శిల్పారామం నుంచి అమరావతి రోడ్డు వరకూ టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.


ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. యువగళానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో ముందుకెళ్తూ.. యాత్రను కొనసాగిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ ప్రభంజనం ఖాయమన్నారు.

ఆదివారం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమవ్వగా.. లోకేష్ ఒంటిమామిడి జంక్షన్లో మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత తొండంగి హనుమాన్ జంక్షన్ లో రైతులతో సమావేశమయ్యారు. శృంగవృక్షంలో ఎస్సీ సామాజిక వర్గీయులను కలిసి లంచ్ బ్రేక్ తీసుకున్నారు. మధ్యాహ్నం కాకినాడ సెజ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.


Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×