E-Paper
Advertisement

భారత్‌ లో E100 ప్యూయల్ కు గ్రీన్ సిగ్నల్.. ఆటో రంగంలో మరో ముందడుగు!

భారత్‌ లో E100 ప్యూయల్ కు గ్రీన్ సిగ్నల్.. ఆటో రంగంలో మరో ముందడుగు!
Advertisement

E100 Approved: దేశం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల్లో E100 ఇంధనాన్ని ఉపయోగించేందుకు అవసరమైన నిబంధనలకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో హై ఇథనాల్‌ తో పని చేసే కార్లు, బైక్‌లు మార్కెట్ లోకి అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అయ్యింది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రాక మరింత ఈజీ

ప్రస్తుతం దేశంలో E20 ప్యూయల్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు E85, E100 వంటి అధిక ఇథనాల్ మిశ్రమాలకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఆటో రంగంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నిర్ణయం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది.

E100 ప్యూయల్ గురించి..

Advertisement

E100 అనేది కంప్లీట్ ఇథనాల్ కాదు. ఇందులో 93 నుంచి 95 శాతం వరకు ఇథనాల్ ఉంటుంది. మిగతా మొత్తంలో పెట్రోల్ ఉంటుంది. ఈ ఫ్యూయల్ ను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే, ఇథనాల్ తో నడిచేలా రూపొందించిన ప్రత్యేక వాహనాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ కార్లలో ఈ ఫ్యూయల్ ను ఉపయోగించే అవకాశం లేదు. ఇందుకోసం ప్రత్యేక ప్యూయల్ సిస్టమ్ ఉండాలి. ఇథనాల్ ను తట్టుకునేలా ఇంజిన్ భాగాలను రూపొందించాల్సి ఉంటుంది. సెన్సార్లు, సాఫ్ట్‌ వేర్, ఇంజిన్ ట్యూనింగ్ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఉన్న వాహనాల ఇంజిన్ లో ఈ ఫ్యూయల్ పోస్తే, చెడిపోయే అవకాశం ఉంటుంది.

మార్కెట్ లోకి ఫ్లెక్స్ ప్యూయల్ వాహనాలు

కొద్ది రోజుల క్రితం మారుతీ సుజుకి, హీరో మోటోకార్ప్ లాంటి దిగ్గజ సంస్థలు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రదర్శించాయి. టయోటా, హ్యుందాయ్, ఎంజీ లాంటి సంస్థలు కూడా భవిష్యత్తులో ఇథనాల్‌ కు అనుకూలమైన వాహనాలను తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.

ఇంధన దిగుతమతులు తగ్గే అవకాశం

Advertisement

తాజాగా కేంద్రం ఆమోదించిన E100 ఇంధనం అందుబాటులోకి వస్తే, విదేశాల నుంచి మనం చేసుకునే చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి తెచ్చుకుంటుంది. ఇథనాల్ వినియోగం పెరిగితే దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇంధనంపై ఆధారం పెరిగి, విదేశాలపై ఆధారపడే ఆవకాశం తగ్గుతుంది. ఇథనాల్ మిశ్రమాల వినియోగంతో భారత్ కు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.

రైతులకు లాభం కలిగే అవకాశం

అటు ఇథనాల్ తో రైతులకు లాభదాయకం కానుంది. చెరకు, మొక్కజొన్న, ధాన్యాలు లాంటి పంటల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగం పెరిగితే వేల కోట్ల రూపాయల ఆదాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి పంప్ కానుంది.

Read Also: భారత్‌ లో మళ్లీ హైబ్రిడ్ కార్ల హవా.. ఏడాదిలో 6 కొత్తమోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Related News

చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

2.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న BYD పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు!

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

Big Stories

Advertisement
×