Bhotekoshi Flood: బోటే ఖోషీ నదిలో ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక జలప్రళయం వెనుక అసలు కారణం.. భూకంపం కాదని USGS తేల్చింది. నేపాల్ మంచు కొండల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వాటర్ బాంబ్ ఎప్పుడు విరుచుకుపడుతుందో చెప్పలేం. అలా మారుతోంది పరిస్థితి. ఇదే ప్రాంతంలో గత ఏడాది కూడా ఇలాంటి సరస్సు ఉప్పొంగి బోటే ఖోషీ పరివాహక ప్రాంతాన్ని దెబ్బతీసింది. హిమాలయాల్లో వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీ నదుల తగ్గుదల ప్రమాదాన్ని పెంచుతున్నాయన్న ఆందోళనలూ ఉన్నాయ్. అయితే చైనా నిర్మాణాలే ఈ విపత్తుకు కారణమన్న వాదన పెరుగుతోంది. సరిహద్దు దేశాలు రియల్టైమ్ డేటా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పంచుకోవాల్సిన అవసరం లేదా? హిమాలయాల హెచ్చరికను భారత్ ఇప్పుడైనా సీరియస్గా తీసుకుంటుందా?