Anuroop Reddy: చావుబతుకుల్లో ఉన్న ముగ్గురి ప్రాణాలు కాపాడాడు.. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. అంతలోనే అనుకోని ప్రమాదం అతని ప్రాణం తీసింది. కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. మనం మాట్లాడుకుంటున్నది అనురూప్ రెడ్డి గురించి. అతని భౌతికకాయం అమెరికా నుంచి హైదరాబాద్కు చేరింది. అందరి గుండెలను మరింత బరువెక్కించింది.
తమ కళ్లముందే పెరిగి, అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటూ అంతలోనే అనంత లోకాలకు వెళ్లిన అనురూప్ను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనురూప్ రెడ్డి ఇటీవలే అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. గత నెల 29న ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పి టొలెడోబెండ్ రిజర్వాయర్కు వెళ్లారు. అక్కడే తన ఫ్రెండ్స్ నది ప్రవాహంలో కొట్టుకుపోతుండటం చూసి వెంటనే నదిలోకి దూకి ముగ్గురిని కాపాడాడు. కానీ తాను ఒడ్డుకు చేరే టైమ్లో ఫిషింగ్ నెట్ కాళ్లకు చుట్టుకొని నీటిలో మునిగిపోయాడు. తన ఫ్రెండ్స్ ప్రాణాలను కాపాడి మరీ ప్రాణాలను వదిలిన రెడ్డి ఒక హీరో అంటున్నారు అతని ఫ్రెండ్స్.
Also Read: Tata Tiago: టాటా టియాగో క్రియేటివ్ vs క్రియేటివ్ ప్లస్.. ఏ వేరియంట్ కొనడం బెస్ట్?
23 ఏళ్ల వయసులోనే అనురూప్ చూపించిన తెగువపై సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. అనురూప్ చూపిన ధైర్యసాహసాలు, మానవత్వం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ఆయన. ఆయన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కష్టసమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనురూప్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజల తరఫున ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించిన సీఎం.. అనురూప్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
అనురూప్ రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. స్నేహితుల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన అనురూప్రెడ్డిని ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. అనురూప్ రెడ్డికి ఇటీవల కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగంలో చేరి కుటుంబ భారాన్ని మోస్తాడనుకుంటే ఇలా నిర్జీవంగా ఇంటికి తిరిగి వస్తాడనుకోలేదంటూ అంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: Cyber Hacking: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అకౌంట్ హ్యక్ కలకలం