Kodad Accident: కోదాడ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నిన్న తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఇది ఒక్క ప్రమాదం కాదు.. NH-65పై భద్రతపై పెరుగుతున్న ఆందోళనకు తాజా ఉదాహరణ. గత ఏడాది ఈ హైవేపై ఏకంగా 1,661 ప్రమాదాలు, 354 మరణాలు నమోదైనట్టు తాజా రిపోర్టులు చెబుతున్నాయ్. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also read: Best Gaming Phones: పవర్ఫుల్ ప్రాసెసర్, కూలింగ్తో అదరగొడుతున్న 3 స్మార్ట్ఫోన్లు!
రాత్రి అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వేగానికి అడ్డూ అదుపూ ఉండట్లేదు. రోడ్డుపై ఏదైనా వెహికిల్ ఆగిపోతే అంతే సంగతులు. వేగంగా వచ్చే వెహికిల్స్ ఒక్కసారిగా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏదైనా వాహనం ఆగితే దాన్ని పక్కకు తీసేలా పెట్రోలింగ్ వ్యవస్థ ఏం చేస్తోందన్న ప్రశ్నలు వస్తున్నాయ్. ఇంత భారీ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు కనిపించకపోవడమే క్వశ్చన్ మార్క్ గా మారుతోంది. ఓవర్స్పీడ్, డ్రైవర్ అలసట, వాహనాల ఫిట్నెస్, రాత్రి పెట్రోలింగ్పై కఠిన నిఘా ఎప్పుడు? ఇంకెన్ని ప్రాణాలు పోతే వ్యవస్థ కళ్లు తెరుస్తుంది?