Reservation Protest: ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా రిజర్వేషన్ హటావో ఆందోళన హీట్ పెంచింది. నిరసనలో పాల్గొన్న 50 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో సరైన విధానం కాదంటున్న నిరసనకారులు.. నిజంగా పేదరికమే ప్రామాణికంగా ఉండాలంటున్నారు.
Also Read: కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహం.. డైరెక్ట్ ఎలక్షన్స్తో మారనున్న లోకల్ రాజకీయం
అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు తీసుకొచ్చిన రిజర్వేషన్లను.. కేవలం ఆర్థిక ప్రాతిపదికకు పరిమితం చేయడం సాధ్యమేనా? పేదరికం ఒక్కటే వెనుకబాటుతనానికి కొలమానమా? కుల వివక్ష, సామాజిక అసమానతల ఇష్యూ కూడా మరో కోణంలో చర్చనీయాంశంగా ఉంటుంది. మరోవైపు.. రిజర్వేషన్ల ప్రయోజనాలు నిజంగా అర్హులైన పేదలకు చేరుతున్నాయా? పాలసీలో మార్పులు అవసరమైతే.. వాటిని ఎలా అమలు చేయాలి? జంతర్మంతర్ నిరసనతో మొదలైన ఈ డిబేట్.. దేశ రాజకీయాల్లో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.