Direct Elections: స్థానిక సంస్థల్లో మేయర్, మున్సిపల్ ఛైర్మన్, జెడ్పీ ఛైర్మన్ వంటి కీలక పదవులకు డైరెక్ట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు సభ్యుల ద్వారా జరిగే పరోక్ష ఎన్నికలకు బదులు.. ప్రజలే నేరుగా చైర్మన్ ను ఎన్నుకునేలా మార్పులు జరుగుతున్నాయ్. అయితే.. ఇందులో రాజకీయ లెక్కలేంటి? డైరెక్ట్ ఎలక్షన్ వస్తే తమకు భారీ ప్లస్ అంటోంది వైసీపీ. గతంలో గెలిచిన స్థానిక ప్రతినిధుల బలంతో పవర్ మారినా తమ మేయర్లు, ఛైర్మన్లు కొనసాగుతారన్న నమ్మకమా? మరోవైపు కూటమి మాత్రం.. నేరుగా ప్రజల తీర్పు వస్తే తమకే అడ్వాంటేజ్ అన్న ధీమాతో ఉంది.
Also read: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు!
అసలే స్థానిక సంస్థల్లో రాజకీయం జోరుగా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ పదవులతో పొలిటికల్ గేమ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. లోకల్ బాడీస్పై ఎవరి కంట్రోల్ ఉంటుంది? ప్రజల మాండేట్ బలమా.. పార్టీ నంబర్ గేమ్ బలమా? అభివృద్ధి కోసమే ఈ మార్పా.. లేక భవిష్యత్ పొలిటికల్ లెక్కల కోసమా? ఎవరి వ్యూహం ఎంత వర్కవుట్ అవుతుందో చూడాలి.