YSRCP Protests: జగన్ పిలుపిస్తేనే వైసీపీ ఉద్యమం ఊపందుకుంటోందా? అధినేత పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన పార్టీ.. ఆ తర్వాత అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోతోందా? అసలు వైసీపీకి గ్రౌండ్లో ఏం జరుగుతోంది?
డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ సమస్యలపై వైసీపీ ఆందోళనలు చేస్తోంది. కానీ రాష్ట్రవ్యాప్త ఇష్యూస్పై జగన్ స్వయంగా పిలుపిస్తేనే క్యాడర్ కదులుతుందన్న అభిప్రాయం వస్తోంది. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేతలు గుర్తించి.. వాటిని పొలిటికల్ ఇష్యూస్గా ఎందుకు మార్చలేకపోతున్నారన్న డౌట్ రెయిజ్ అవుతోంది.
Also read: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు!
నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఎక్కడికక్కడ మూమెంట్ ఉండట్లేదా? అన్నీ అధినేతే చూసుకుంటేనే వర్కవుట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. జిల్లా స్థాయిలో బలమైన ఉద్యమాలు ఎందుకు కనిపించడం లేదన్న టాక్ వైసీపీలో వినిపిస్తోంది. అధికార పార్టీని కౌంటర్ చేసే క్రమంలో వైసీపీ వెనుకబడుతోందా అన్న చర్చైతే ఉంది. అధినేత సెంట్రిక్ గా మ్యాటర్ నడుస్తోందా? లేక లోకల్ లీడర్షిప్ యాక్టివ్గా లేదా? వీటన్నిటిపై పార్టీలో డిస్కషన్ అవసరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
Also Read: 22A జాబితా నుండి భూముల తొలగింపు సులువయ్యేనా.. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్కార్ నిర్ణయం ఇదే!